ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం.. బయటి నేతలు అంతా వెళ్లిపోవాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం క్లోజయింది. మైకులన్నీ మూగబోయాయి. బయటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. డబ్బు పంపిణీ జరుగుతోందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే సాగర్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాగర్ ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సీఈవో శశాంక్ గోయల్.. అధికారులతో సమీక్ష జరిపారు. పోలింగ్ సామాగ్రి, విధులు నిర్వర్తించే సిబ్బంది.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈసారి వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేశారు.
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా కోవిడ్ పేషెంట్స్కు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.కోవిడ్ విజృంభణ కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించనున్నారు. మరో పక్క తిరుపతి ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. గెలిచి, సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ విజృంభణ నేపథ్యంలో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!