ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం.. బయటి నేతలు అంతా వెళ్లిపోవాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం క్లోజయింది. మైకులన్నీ మూగబోయాయి. బయటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. డబ్బు పంపిణీ జరుగుతోందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే సాగర్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాగర్ ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సీఈవో శశాంక్ గోయల్.. అధికారులతో సమీక్ష జరిపారు. పోలింగ్ సామాగ్రి, విధులు నిర్వర్తించే సిబ్బంది.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈసారి వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేశారు.
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా కోవిడ్ పేషెంట్స్కు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.కోవిడ్ విజృంభణ కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించనున్నారు. మరో పక్క తిరుపతి ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. గెలిచి, సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ విజృంభణ నేపథ్యంలో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- Tags
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!