IRCTC Ticket Booking: గుడ్న్యూస్.. డబ్బులు లేకున్నా రైలు ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Ticket Booking: అర్జంట్గా రైలు ప్రయాణం చేయాల్సి ఉందా..? సమయానికి డబ్బులు జేబులో లేవా? ఆ మొత్తాన్ని సమకూర్చుకునే సమయం కూడా లేదా..? అయితే, టెన్షన్ పడాల్సిన పనేలేదు.. హాయిగా మీరు జర్నీ చేయొచ్చు.. అదేంటి? ఉచితంగా రైలు ప్రయాణమా? అనే సందేహం వచ్చిందేమో.. రైలు ప్రయాణమే.. కానీ, ఉచితం కాదండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. పేమెంట్ మాత్రం లేట్గా చేసే అవకాశం ఉంది.. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా బుక్ చేసుకునే టికెట్ల కోసం ‘బై నౌ పే లేటర్’ సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఇక, ఈ సేవలను ప్రయాణికులకు అందించడానికి ఐఆర్సీటీసీ కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంది.. క్యాష్ఈ, పేటీఎం, ఈపేలేటర్తో చేతులు కలిపి.. ప్రయాణికులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.. క్యాష్ఈ ‘ట్రావెల్ నౌ పే లేటర్’ పేరిట ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ టికెట్లను ఎలా పొందాలి..? ఎంత వరకు లిమిట్ ఉంటుంది? ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లించాలి? అనే కండీషన్స్ కొన్ని ఉన్నాయి.. పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్పెయిడ్ సర్వీసులను అందిస్తుండగా.. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణాలు అందజేస్తోంది.. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదని పేటీఎం వర్గాలు చెబుతున్నాయి.. అయితే, అప్పటికీ మొత్తం రీఫండ్ చేసే పరిస్థితి లేకపోతే.. ఆ పేమెంట్ను సులభంగా.. ఈఎంఐగా కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.. దీని ద్వారా ఐఆర్సీటీసీలో రైల్వే టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చన్నమాట.
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
టికెట్ బుక్చేసుకునే వారు ఐఆర్సీటీసీ పోర్టల్లో తమ గమ్యస్థానం, ఇతర వివరాలు ఎంటర్ చేసిన తర్వాత టికెట్ బుక్చేసుకునే సమయంలో.. పేమెంట్ సెక్షన్లో పే లేటర్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.. అక్కడే పేటీఎం పోస్ట్పెయిడ్ను ఎంపిక చేసుకోవచ్చు.. అయితే, పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఆ ప్రక్రియ పూర్తి అయితే.. రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టు. ఇక, టికెట్కు అయిన మొత్తాన్ని ఈఎంఐల కింద 3 లేదా 6 నెలల కాల వ్యవధిలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.. మరోవైపు ఈపేలేటర్ అనే ఫిన్టెక్ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. అందులో మాత్రం 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన పెట్టింది.. లేని పక్షంలో ఆ మొత్తంపై 36 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.. ఏదేమైనా డబ్బులు లేని సమయంలో అత్యవసర ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
తాజావార్తలు
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
-
PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?