IRCTC Ticket Booking: గుడ్న్యూస్.. డబ్బులు లేకున్నా రైలు ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Ticket Booking: అర్జంట్గా రైలు ప్రయాణం చేయాల్సి ఉందా..? సమయానికి డబ్బులు జేబులో లేవా? ఆ మొత్తాన్ని సమకూర్చుకునే సమయం కూడా లేదా..? అయితే, టెన్షన్ పడాల్సిన పనేలేదు.. హాయిగా మీరు జర్నీ చేయొచ్చు.. అదేంటి? ఉచితంగా రైలు ప్రయాణమా? అనే సందేహం వచ్చిందేమో.. రైలు ప్రయాణమే.. కానీ, ఉచితం కాదండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. పేమెంట్ మాత్రం లేట్గా చేసే అవకాశం ఉంది.. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా బుక్ చేసుకునే టికెట్ల కోసం ‘బై నౌ పే లేటర్’ సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఇక, ఈ సేవలను ప్రయాణికులకు అందించడానికి ఐఆర్సీటీసీ కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంది.. క్యాష్ఈ, పేటీఎం, ఈపేలేటర్తో చేతులు కలిపి.. ప్రయాణికులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.. క్యాష్ఈ ‘ట్రావెల్ నౌ పే లేటర్’ పేరిట ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ టికెట్లను ఎలా పొందాలి..? ఎంత వరకు లిమిట్ ఉంటుంది? ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లించాలి? అనే కండీషన్స్ కొన్ని ఉన్నాయి.. పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్పెయిడ్ సర్వీసులను అందిస్తుండగా.. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణాలు అందజేస్తోంది.. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదని పేటీఎం వర్గాలు చెబుతున్నాయి.. అయితే, అప్పటికీ మొత్తం రీఫండ్ చేసే పరిస్థితి లేకపోతే.. ఆ పేమెంట్ను సులభంగా.. ఈఎంఐగా కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.. దీని ద్వారా ఐఆర్సీటీసీలో రైల్వే టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చన్నమాట.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
టికెట్ బుక్చేసుకునే వారు ఐఆర్సీటీసీ పోర్టల్లో తమ గమ్యస్థానం, ఇతర వివరాలు ఎంటర్ చేసిన తర్వాత టికెట్ బుక్చేసుకునే సమయంలో.. పేమెంట్ సెక్షన్లో పే లేటర్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.. అక్కడే పేటీఎం పోస్ట్పెయిడ్ను ఎంపిక చేసుకోవచ్చు.. అయితే, పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఆ ప్రక్రియ పూర్తి అయితే.. రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టు. ఇక, టికెట్కు అయిన మొత్తాన్ని ఈఎంఐల కింద 3 లేదా 6 నెలల కాల వ్యవధిలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.. మరోవైపు ఈపేలేటర్ అనే ఫిన్టెక్ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. అందులో మాత్రం 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన పెట్టింది.. లేని పక్షంలో ఆ మొత్తంపై 36 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.. ఏదేమైనా డబ్బులు లేని సమయంలో అత్యవసర ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..