Site icon NTV Telugu

Fuel Price Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒక లీటరు ధర ఎంతంటే!

Premium Fuel

Premium Fuel

Fuel Price Hike ఇటీవల కాలంలో యుద్ధం ఎఫెక్ట్‌గా గట్టిగా తగిలిన రంగం.. చమురు. భారత దేశం లాంటి చమురు దిగుమతి దేశంపై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. తాజాగా ఢిల్లీలో ప్రీమియం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.1.50 పెరిగింది. ఇదే సమయంలో ప్రీమియం పెట్రోల్ ధర కూడా పెరిగింది. ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ యొక్క XP100 పెట్రోల్ (ప్రీమియం వేరియంట్), ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) ధరలు పెరిగాయి.

READ ALSO: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన

XP100 ధరను లీటరుకు రూ.149 నుంచి రూ.160కి పెంచారు. ఇండియన్ ఆయిల్ వారి XP100, భారతదేశపు మొట్టమొదటి 100-ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్. దీనిని ఉన్నత శ్రేణి లగ్జరీ కార్లు, సూపర్‌బైక్‌ల కోసం వినియోగిస్తారు. అదేవిధంగా, ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) ధర గతంలో ఉన్న రూ.91.49 నుంచి ఇప్పుడు రూ.92.99కి పెంచి విక్రయించనున్నారు.

ఎల్పీజీ ధరలు కూడా ..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను కూడా ఈరోజు మార్చారు. ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు. అయితే, 5 కేజీల చిన్న సిలిండర్లు, 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు మాత్రం పెరిగాయి. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.51 పెరగగా, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర సుమారుగా రూ.196 పెరిగింది. ఇదే సమయంలో ఢిల్లీతో సహా నాలుగు ప్రధాన నగరాల్లో జెట్ ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఈ రోజు నుంచి ఢిల్లీలో జెట్ ఇంధనం లీటరు ధర రూ.207,341.22 కు చేరింది. కోల్‌కతాలో లీటరు ధర రూ.205,953.33కు చేరింది. ముంబైలో లీటరు ధర రూ.194,968.67గా ఉండగా, చెన్నైలో ఇది లీటరుకు రూ.214,597.66గా ఉంది.

READ ALSO: April Fool’s Day History: ఏప్రిల్ 1న ఎందుకు అందరినీ ఫూల్స్ చేస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఇదే!

Exit mobile version