Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్.. మూడో గండిని పూడ్చివేసిన అధికారులు
- ఆపరేషన్ బుడమేరు సక్సెస్
- మూడో గండిని పూడ్చివేసిన అధికారులు
- నాలుగు రోజులుగా కొనసాగుతున్న గండ్ల పూడ్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరద ఉధృతితో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. మూడో గండి పూడ్చివేత పూర్తి కావడంతో బెజవాడకు తప్పిన వరద ముప్పు తప్పింది. వర్షంలోనే మూడో గండి పూడ్చివేత కొనసాగింది. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత కొనసాగింది. గండ్లను విజయవంతంగా పూర్తిచేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
Read Also: Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కును అందించిన పవన్కల్యాణ్
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
లెఫ్ట్ బండ్ మూడు గండ్లు సీఎం చంద్రబాబు సూచనలతో పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎంత ఎక్విప్మెంట్ అయినా వినియోగించుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. పనులు ఆపకుండా, తీవ్ర గాలులను లెక్క చేయకుండా పని చేశామన్నారు. మిలిటరీ సైతం మా పనులను అభినందించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. చంద్రబాబు కలెక్టరేట్లో ఉండి రెండు గంటలు కూడా నిద్రపోలేదన్నారు. మంత్రులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని.. కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది అని వ్యాఖ్యానించారు. బుడమేరుకు మరో 8వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అప్పటి సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో ప్రజల్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. “బుడమేరును ఐదేళ్ళలో జగన్ పట్టించుకోలేదు. 35వేల క్యూసెక్కులు ప్రవహించేలా చంద్రబాబు టెండర్లు పిలిచారు. మిగిలిన పనులు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు వరద ఉధృతి ఆధారంగా లిఫ్ట్ చేశాం. కొల్లేరుకు కనుక నీటిని పంపి ఉండకపోతే బుడమేరు లెఫ్ట్ బండ్ పోయేది.” అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?