NTV Telugu Site icon

KCR: భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా: కేసీఆర్

Pawan Kalyan

Pawan Kalyan

సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ తన ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ స‌తీమణి శోభ కూడా చింత‌మ‌డ‌క‌లో ఓటు వేశారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు చింత‌మ‌డ‌క‌ గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఓటు వేసిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోంది. 65-70 శాతం పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారత కూటమిలో చేరతారా? అని అడగ్గా.. ‘బీజేపీ స్వంత రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయస్సు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని కేసీఆర్ బదులిచ్చారు.