Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్యెల్యే విచారణకు గైర్హాజరు..

Chirumurthy Lingaiah

Chirumurthy Lingaiah

ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడితో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు ఇచ్చారు. ఈరోజు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి రాజకీయ నాయకుడికి నోటీసులు ఇచ్చారు. ఆయన తర్వాత మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

BRS Ex MLA Chirumarthi Lingaiah Didn't Appear For Enquiry In Phone Tapping Case | Ntv

Exit mobile version