బ్రహ్మానందం 70వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఒక సాధారణ అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, తన అద్భుతమైన హావభావాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా, సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేయాలన్నా ఆయన ముఖం మీద పలికే ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు. అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన ఆయన 70వ పుట్టినరోజు వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుతో పాటు టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటులంతా హాజరై బ్రహ్మీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ తన 42 ఏళ్ల నట ప్రయాణంలో ఎదురైన కష్టసుఖాలను పంచుకున్నారు.
Also Read : Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
బ్రహ్మానందం మాట్లాడుతూ ‘నా విజయానికి కారణం నేను కాదు, ప్రేక్షకుల ఆశీస్సులేన’ అని వినమ్రంగా చెప్పారు. ‘నేను ఇన్ని సినిమాల్లో నటించానంటే అది నా గొప్పతనం కాదు, నన్ను నమ్మి అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలది. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి రావడానికి జంధ్యాల గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రామానాయుడు గారే కారణం. చిరంజీవి గారు నాలోని ప్రతిభను గుర్తించి, నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్లి మరీ ఇండస్ట్రీలోని పెద్దలందరికీ పరిచయం చేశారు. ‘అహ నా పెళ్ళంట’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూశాను కానీ, మీ ప్రేమ ముందు అవన్నీ చిన్నవైపోయాయి’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.
