Site icon NTV Telugu

Love: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఘోరం..

Love

Love

వాళ్లిద్దరు పోయిన సంవత్సరం ఓ పెళ్లిలో కలిశారు. అప్పుడే ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఆ ప్రియుడు, ప్రియురాలి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియురాలు తనను పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరింది. డబ్బు కూడా కావాలని డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన ప్రియుడు ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వారణాసిలో 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు వివాహ ఒత్తిడి, పదే పదే డబ్బు డిమాండ్ చేయడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?

మిర్జామురాద్ ప్రాంతంలోని రూపపూర్‌లోని విధాన్ బసేరా ధాబాలోని ఒక గదిలో గురువారం బాధితురాలు అల్కా బింద్ మృతదేహం గొంతు కోసి, దుప్పటిలో చుట్టి కనిపించింది. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లిన మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) విద్యార్థిని కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సహబ్ బింద్‌ను గురువారం భడోహిలోని అతని సోదరి ఇంట్లో అరెస్టు చేశారు. “అతను పోలీసు నుంచి తుపాకీని లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు, అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కాలుపై కాల్పులు జరిపారు. నిందితుడి మీర్జాపూర్‌కు చెందినవాడు. అతను చికిత్స పొందుతున్నాడు అని వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఆకాష్ పటేల్ తెలిపారు.

Also Read:Kurnool Diamond: వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే

బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కళాశాలకు వెళ్లడానికి అల్కా తన ఇంటి నుంచి బయలుదేరింది కానీ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ రాత్రి తరువాత ఓ ధాబా గదిలో ఆమె మృతదేహం లభ్యమైందని డిసిపి తెలిపారు. ధాబా ఉద్యోగి ఒకరు గదిలో శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు మృతదేహాన్ని కనుగొన్నారని పోలీసులు తెలిపారు.

Also Read:Rayachoti Terrorists: ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి తనిఖీలు.. వస్త్ర వ్యాపారం ముసుగులో..!

ఆ మహిళ కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమె ప్రియుడు సాహబ్ బింద్‌ను గుర్తించి, భడోహిలోని అతని సోదరి ఇంట్లో అరెస్టు చేశారు. విచారణ సమయంలో, వివాహం మరియు డబ్బు కోసం అల్కా పదే పదే డిమాండ్ చేయడంతో విసిగిపోయి తాను ఆమెను హత్య చేశానని సహబ్ బింద్ చెప్పాడు అని పోలీస్ అధికారి చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version