Botsa Satyanarayana: ఉత్తమ మార్కులు తెచ్చుకున్న సర్కారీ స్కూల్ విద్యార్ధులకు అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులకు అవార్డులు ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. మెరుగైన విద్యార్ధులుగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నాం. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను ప్రోత్సాహించేలా ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తాం అన్నారు. ఈ నెల 27న జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన10th, inter విద్యార్ధులకు అవార్డులు అందిస్తామన్నారు.
Read Also:Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలోకి అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు..!
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఈనెల 31న రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను సత్కరించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే రోజు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తాం. సుమారు 2831 మందిని సత్కరించనున్నాం అని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్ధాయిలో సత్కారం పొందేవారికి పతకం, మెరిట్ సర్టిఫికేట్ అందిస్తామన్నారు. జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 50వేలు, రెండవ స్ధానం 30వేలు, ౩వ స్ధానం 10వేలు నగదు బహుమానం అందిస్తామన్నారు.
రాష్ట్ర స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 1 లక్ష రూపాయలు, రెండవ స్ధానం 75వేలు, ౩వ స్ధానం 50వేలు నగదు బహుమానంగా ఇస్తామన్నారు. రాష్ట్ర స్ధాయి కార్యక్రమానికి సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా పిలుస్తాం. ఇప్పుడు అవార్డులు తీసుకునే విద్యార్ధులను చూసి వచ్చే సంవత్సరం కూడా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. ఇది ప్రోత్సహం తో కూడుకున్న పోటీ అన్నారు మంత్రి బొత్స.
Read Also: IRCTC Ticket Booking: గుడ్న్యూస్.. డబ్బులు లేకున్నా రైలు ప్రయాణం..
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!