Site icon NTV Telugu

Operation Sindoor: భారత్ మెరుపు దాడి.. హఫీజ్ ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

Pak Terror

Pak Terror

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు.

Also Read:AAA : హీరో నేనే.. విలన్ నేనే.. తగ్గేదెలా

పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో భారతదేశం జరిపిన వైమానిక దాడిలో అజార్ కుటుంబం మట్టుబెట్టబడింది. ఈ దాడిలో మౌలానా మసూద్ అజార్ అక్క, మౌలానా కషాఫ్ కుటుంబం మొత్తం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్ళు మరణించారని, అనేక మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడిలో మరణించిన అజార్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు.

Exit mobile version