Boat Capsizes: పడవ బోల్తా.. 78 మంది మృతి!

  • మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘటన.
  • కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కివు సరస్సులో 278 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ.
  • ఘటనలో 78 మంది మరణించారని
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల సమాచారం.
Boat Capsizes

Boat Capsizes

Boat Capsizes: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కివు సరస్సులో గురువారం వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 78 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు సమాచారం అందించారు. ఘటన సమయంలో 278 మంది ఉన్నారని.. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ తెలిపారు. ఘటనలో 78 మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Somireddy Chandramohan Reddy : అప్పటి వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది

×
×
Ad

అంతకుముందు, బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కిటుకు రేవుకు కొన్ని మీటర్ల దూరంలో పడవ మునిగిపోయింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు పడవ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదివరకు జూన్‌లో రాజధాని కిన్షాసా సమీపంలో ఫెర్రీ మునిగిపోవడంతో 80 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Narhari Zirwal: భవనంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!