NTV Telugu Site icon

MP Ramesh : యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలి

Mp Ramesh

Mp Ramesh

జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమను ఒక్క శాతం కూడా అభవృద్ధి చెందలేదని అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పురోగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎంపీ రమేష్‌ వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లు జగన్ సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారు.. పురపాలికల్లో ఎలాంటి అభివృద్ధి లేదని, సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఐదు స్థానాల్లో కూటమి మంచి మెజారిటీతో విజయం సాధించిందన్నారు రమేష్‌. షర్మిల పోటీలో లేకపోతే కడప పార్లమెంట్ స్థానంలో కూడా గెలిచేవాళ్లమని ఆమె అన్నారు. ప్రొద్దుటూరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని, ప్రజలను బయపెట్టి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరింది వసూళ్లకు పాల్పడ్డారన్నారు ఎంపీ రమేష్‌. ప్రజలు భయపడకుండా ఫిర్యాదు చేస్తే వసూళ్లు చేసిన డబ్బులు వెనక్కి ఇప్పిస్తామని, ప్రొద్దుటూరులో టిడిపి నేత నందం సుబ్బయ్యను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు ఎంపీ రమేష్‌. నందం సుబ్బయ్య హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టించారని, జిల్లాలో జరిగిన భూ దందాల పై విచారణ చేయిస్తామన్నారు.