BJP Kerala Victory: కేరళలో ఎల్డీఎఫ్ కోటను కూల్చిన బీజేపీ..
- తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయం
- నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఓటమి
- అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Kerala Victory: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కంచు కోటగా ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఎల్డీఎఫ్ నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. రాజధానిలో ఈ అధికార మార్పు లెఫ్ట్ ఫ్రంట్కు పెద్ద రాజకీయ దెబ్బగా చెబుతున్నారు.
READ ALSO: Shehbaz Sharif Trolled: ప్రపంచం ముందు పాక్ ప్రధాని నవ్వుల పాలైన 6 సందర్భాలు ఇవే..
Also Read
- Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
- Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
నిజానికి తిరువనంతపురం అనేది కేరళ పరిపాలనా రాజధాని మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఈ లోక్సభ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా కాంగ్రెస్, వామపక్ష కూటమికి బలమైన కంచుకోటగా పేరుంది. కానీ తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఇక్కడి నుంచి విజయం సాధించడం రాష్ట్రంలో కొత్త చర్చకు కారణం అయ్యింది.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో 2-3 సీట్లు గెలవడం కంటే బీజేపీ ఈ విజయం చాలా ముఖ్యమైనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వంటి చోట్ల అధికారం పొందడం అంటే పట్టణ ఓటర్లు రాజకీయ ప్రత్యామ్నాయాలను కోరుకోవడాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ప్రధాన పోటీ LDF, UDF మధ్య ఉండేది. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా ఈ పోరులోకి ఎంట్రీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటున్నారు. ఎల్డీఎఫ్ బలమైన కోట అయిన తిరువనంతపురంలో లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ విజయాన్ని ప్రజల చారిత్రాత్మకమైన తీర్పుగా బీజేపీ అభివర్ణించింది. ఈ ఫలితం కేరళలో బీజేపీకి సంస్థాగతంగా పెరుగుతున్న మద్దతును, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. తాజా విజయంతో కాషాయదళంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ గెలుపు కేరళలో బీజేపీ భవిష్యత్తు రాజకీయ జీవితానికి బలమైన పునాదిగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలను LDF నాయకత్వం తీవ్రంగా పరిగణించింది, ఆత్మపరిశీలన చేసుకోవాలని నాయకులకు పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలను వార్డు స్థాయిలో విశ్లేషించి, అవసరమైతే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ..
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినందుకు నగర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా “ధన్యవాదాలు తిరువనంతపురం!” అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేరళ రాజకీయాల్లో తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల తీర్పును ఒక ” కీలక మలుపు”గా అభివర్ణించారు. ఇక్కడ బీజేపీ-ఎన్డిఎకు లభించిన మద్దతు, కేరళ అభివృద్ధి ఆకాంక్షలను తమ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. తిరువనంతపురం వంటి శక్తివంతమైన నగరాన్ని అభివృద్ధి చేయడానికి, సామాన్య ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపరచడానికి తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
Thank you Thiruvananthapuram!
The mandate the BJP-NDA got in the Thiruvananthapuram Corporation is a watershed moment in Kerala’s politics.
The people are certain that the development aspirations of the state can only be addressed by our Party.
Our Party will work towards…
— Narendra Modi (@narendramodi) December 13, 2025
READ ALSO: Pawan Kalyan: కెప్టెన్ దీపిక వినతిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. వెంటనే చర్యలు
తాజావార్తలు
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
-
Ranabali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!