NTV Telugu Site icon

Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..

Mumbai

Mumbai

ముంబైలో దారుణం జరిగింది. పుట్టిన రోజే యువకుడు హత్య చేయబడ్డాడు. అయితే.. 20 ఏళ్ల యువకుడి పుట్టినరోజు వేడుకలు అతని నలుగురు స్నేహితులు చేశారు. దీంతో ఓ హాటల్ లో వారు ఫుడ్ తీన్నారు.. దీంతో ఫుడ్ బిల్లు రూ. 10,000 కావాడంతో ఆ బిల్లును పంచుకోవడంపై జరిగిన వాదనలో సదరు యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ ఘటన గత వారం ముంబైలోని గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతంలో జరిగింది.

Also Read: Balanagar Flyover: బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..

నిందితుల్లో ఇద్దరు అహ్మదాబాద్‌కు చెందిన షారుక్‌, నిషార్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు మరో ఇద్దరు మైనర్‌ నిందితులను జువైనల్‌ హోంకు తరలించారు. బాధితుడు సాబీర్ అన్సారీ మే 31న రోడ్డు పక్కన ఉన్న ధాబాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.. అక్కడ ఆహార బిల్లు దాదాపు రూ. 10,000 వచ్చింది. నలుగురు నిందితులు సబీర్‌కు డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో సాబీర్ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు.

Also Read: Indian Democracy: మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉంది..

అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో, సబీర్ తన డబ్బు కోసం నిందితుడు షారుక్ మరియు అతని మరో ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లగా, వారు నిరాకరించి, బెదిరించారు. అనంతరం సబీర్ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో శివాజీ నగర్‌ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో సాబీర్‌ తన ఇతర స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

Also Read: Indian Navy: భారత నేవీ ప్రయోగించిన ‘వరుణాస్త్రం’.. శత్రువు గుండెల్లో దడే

ఇక అదే సమయంలో నిందితులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని దుర్భాషలాడారు. వారు పదునైన ఆయుధంతో సబీర్‌పై దాడి చేశారు, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాబీర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు శివాజీ నగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 302,323,109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.