Bihar High Alert: బిహార్లో హై అలర్ట్.. నేపాల్ గుండా భారత్లోకి ఉగ్రవాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar High Alert: నేపాల్ గుండా పాకిస్థాన్కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించారని సమాచారం రావడంతో గురువారం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసందర్భంగా బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి చొరబడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విభాగాల పోలీసులు అలర్ట్లో ఉన్నారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా నిలువరించడానికి తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
READ ALSO: Menstruation Pills: పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. వీళ్లు ఈ నెల రెండోవారంలో పాక్ నుంచి కాఠ్మాండూకు చేరుకొని అక్కడి నుంచి గతవారం బిహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిదని అన్నారు. ఇప్పటికే వారి ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపామని పేర్కొన్నారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఈ ఫోటోల ఉన్న వ్యక్తులను గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందజేసినా, ఉగ్రవాదుల అరెస్టుకు సహకరించిన వారికి రూ.50వేలు నగదు బహుమతిని అందజేస్తామని పేర్కొన్నారు. వాళ్లు కనిపిస్తే 112, 9431822988, 9031827100 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.
READ ALSO: Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!