Bihar High Alert: బిహార్లో హై అలర్ట్.. నేపాల్ గుండా భారత్లోకి ఉగ్రవాదులు..
Bihar High Alert: నేపాల్ గుండా పాకిస్థాన్కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించారని సమాచారం రావడంతో గురువారం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసందర్భంగా బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి చొరబడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విభాగాల పోలీసులు అలర్ట్లో ఉన్నారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా నిలువరించడానికి తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
READ ALSO: Menstruation Pills: పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. వీళ్లు ఈ నెల రెండోవారంలో పాక్ నుంచి కాఠ్మాండూకు చేరుకొని అక్కడి నుంచి గతవారం బిహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిదని అన్నారు. ఇప్పటికే వారి ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపామని పేర్కొన్నారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఈ ఫోటోల ఉన్న వ్యక్తులను గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందజేసినా, ఉగ్రవాదుల అరెస్టుకు సహకరించిన వారికి రూ.50వేలు నగదు బహుమతిని అందజేస్తామని పేర్కొన్నారు. వాళ్లు కనిపిస్తే 112, 9431822988, 9031827100 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.
READ ALSO: Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?