Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక కెప్టెన్, నలుగురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు. మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. శివగఢ్-అస్సార్ బెల్ట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు ఉండడంతో కాల్పుల్లో ఓ ఉగ్రవాది గాయపడి ఉండొచ్చని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక ఎం4 కార్బైన్, మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి.
Read Also:Home Minister Anitha: అందుకే రాజకీయ హత్యలు.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
ఉధంపూర్ జిల్లాలోని పట్నితోప్ ప్రాంతానికి సమీపంలోని అకర్ అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భావిస్తున్నామని, ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్న ఒక ఉన్నత స్థాయి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావడం గమనార్హం. భారత సైన్యం ఈ ఆపరేషన్కు ఆపరేషన్ అస్సార్ అని పేరు పెట్టింది.
Read Also:DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
మంగళవారం తెల్లవారుజామున, జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో వరుసగా నాలుగో రోజు కూడా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగాయి. మంగళవారం తెల్లవారుజామున అహ్లాన్ గగర్మండు అటవీప్రాంతంలో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలను సెర్చ్ పార్టీలు గమనించి, వారి ఆచూకీ కోసం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు అదనపు భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఆగస్ట్ 10న అనంత్నాగ్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, కోకెర్నాగ్ బెల్ట్లోని అహ్లాన్ గగర్మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారీ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించబడింది.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!