Hyderabad: అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
- పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
- ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని హైదరాబాద్కు
- నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కోసం 8 పొలిసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్పూర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయిన విషయం తెలిసిందే. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
దోపిడీ దొంగలు అఫ్జల్గంజ్లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్పైన కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత దొంగల ముఠా అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు రోషన్ ట్రావెల్స్లో రాయ్పూర్కు 3 టికెట్లు బుక్ చేశారు. దాంతో రాయ్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!