Hyderabad: అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
- పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
- ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని హైదరాబాద్కు
- నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కోసం 8 పొలిసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్పూర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయిన విషయం తెలిసిందే. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
దోపిడీ దొంగలు అఫ్జల్గంజ్లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్పైన కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత దొంగల ముఠా అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు రోషన్ ట్రావెల్స్లో రాయ్పూర్కు 3 టికెట్లు బుక్ చేశారు. దాంతో రాయ్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!