Bhopal Crime News : భోపాల్లో బస్సు డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తులు.. వీరోచితంగా పోరాడిన కండక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhopal Crime News : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నడుస్తున్న సిటీ బస్సులోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు చిన్నపాటి విషయానికి సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్ను కొట్టారు. ఈ ఘటన బస్సులో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. అసలే సిటీ బస్సులో రిజర్వ్ చేయబడిన మహిళల సీటుపై ఓ యువకుడు కూర్చున్నాడు. బస్సు డ్రైవర్ యువకుడిని మహిళల సీటుపై నుంచి లేవాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన యువకులిద్దరూ డ్రైవర్, కండక్టర్పై దాడికి దిగారు.
Read Also:Health Tips: నిజమా.. పసుపు నీరు తాగితే బరువు తగ్గుతారా? ట్రై చేయండి..
Also Read
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
రాష్ట్ర రాజధాని భోపాల్లో సాయంత్రం 5 గంటలకు సూరజ్ నగర్ కూడలి గుండా వెళ్తున్న బస్సును ఇద్దరు యువకులు బైక్పై వచ్చి ఆపి ఎక్కారు. ఆ తర్వాత నిందితులిద్దరూ బస్సు ఎక్కి మహిళా ప్రయాణికుల ఎదుటే డ్రైవర్పై దుర్భాషలాడారు. కండక్టర్ వారిని అడ్డుకోవడంతో డ్రైవర్, కండక్టర్తో గొడవకు దిగారు. ఈ దాడి ఘటన బస్సులోని సీసీటీవీలో రికార్డయింది. దుండగుల దాడిలో డ్రైవర్ కృష్ణపాల్ సింగ్, కండక్టర్ ముని మహేష్ గాయపడ్డారు. డ్రైవర్ కృష్ణపాల్ ముక్కు నుంచి రక్తం వచ్చింది.. కండక్టర్ మహేశ్కు గాయాలయ్యాయి. భోపాల్ సిటీ బస్సులో జరిగిన ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో పురుషులు, మహిళలు, పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారు. కొట్లాట ఘటనను చూసి పిల్లలు భయపడి కేకలు వేశారు.
भोपाल सिटी बस में बदमाशों की गुंडागर्दी का वीडियो वायरल हो रहा हैं जहां 2 बदमाश बस में चढ़कर ड्राइवर-कंडक्टर के साथ मारपीट करने कर रहे हैं !#viralvideos pic.twitter.com/2xJdhbM0c5
— झगड़ा (@Jhagdaa) July 11, 2024
Read Also:Heavy Rains : లక్నో-ఢిల్లీ హైవే మూత.. 11 మంది మృతి.. యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం
బస్సు డ్రైవర్ కృష్ణపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో మహిళలకు రిజర్వు చేసిన సీటుపై ఓ వ్యక్తి కూర్చున్నాడని, అతడిని అక్కడి నుంచి లేవాలని కోరాడు. దీంతో సూరజ్ నగర్ సమీపంలో కొంతదూరంలో ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!