Gender Reveal Test: వీడు డాక్టర్ కాదు కంత్రీగాడు.. అర్థరాత్రి 2 గంటలకు హాస్పిటల్లో అబార్షన్లు!
- లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం
- లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన లక్ష్మీ నరసింహస్వామి స్కానింగ్ సెంటర్
- ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్న డాక్టర్
- అర్థరాత్రి 2 గంటల సమయంలో హాస్పిటల్లో అబార్షన్లు
వాడు.. డాక్టర్ కాదు కంత్రీగాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడి మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఆడ పిల్లలను తల్లి గర్భాశయంలోనే చంపేస్తున్నాడు. గతంలో ఓ ఆస్పత్రిలో ఇలాంటి దందా చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మళ్లీ అదే దందా షురూ చేశాడు. భువనగిరి జిల్లాలో బ్రూణ హత్యలు చేస్తున్న డాక్టర్ శివకుమార్ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం.. ఇది డాక్టర్కు తెలియని విషయం కాదు. కానీ కాసులకు కక్కుర్తిపడ్డ ఓ డాక్టర్.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాదు.. ఏకంగా అబార్షన్లు కూడా చేసేస్తున్నాడు. ఇతని పేరు డాక్టర్ శివకుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిని నడుపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో గాయత్రి హాస్పిటల్లో అబార్షన్లు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో, ఆసుపత్రిలో అప్పటికే ఇద్దరు గర్భిణులకు అబార్షన్లు చేసి, వారిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు గుర్తించారు. పక్కనే పిండాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్రమంగా ఆబార్షన్లు చేసిన డాక్టర్ శివ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
భువనగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి స్కానింగ్ సెంటర్ చట్టవ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన తనిఖీలలో బయటపడింది. మరోవైపు పోలీసులతో పాటు జిల్లా డీఎం అండ్ హెచ్ఓ మాలతి ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. డాక్టర్ శివ కుమార్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు కాదని విచారణలో తేలింది. అంతే కాదు.. ఆసుపత్రికి కూడా అబార్షన్ చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. డాక్టర్ రమ్య , మధు అనే పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసి.. శివ కుమార్ అక్రమంగా ఆసుపత్రి నడిపిస్తునట్లుగా అధికారుల విచారణలో వెల్లడయింది. గతంలో కూడా స్వాతి ఆసుపత్రి పేరు మీద అబార్షన్ చేస్తూ పట్టుబడ్డాడు శివకుమార్. అప్పట్లో స్వాతి ఆసుపత్రి సీజ్ చేశారు అధికారులు. అయినా డాక్టర్ శివకుమార్ బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ గాయత్రీ ఆసుపత్రిగా పేరు మార్చి అబార్షన్లు చేస్తున్నాడు.
లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి స్కానింగ్ సెంటర్.. ఇద్దరు గర్భిణులకు ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పింది. దీంతో మళ్లీ ఆడ శిశువు అని తెలిసి అబార్షన్లు చేయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం స్కానింగ్ సెంటర్ను కూడా సీజ్ చేశారు. భువనగిరి జిల్లాలో ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
-
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్తో సులభంగా ఇలా చేసేయండి.!
-
Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!