NTV Telugu Site icon

Bhatti Vikramarka : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష పెద్ద నగదు కాకపోయినా.. కొంతైనా ఉపశమనం కలగాలని మా ప్రయత్నమన్నారు భట్టి విక్రమార్క. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేస్తున్నామని, ఐదు వేల కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం 3 వేల కోట్లు ఖర్చు చేస్తే..మేము ఐదు వేల కోట్లు పెడుతున్నామని, విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీ తో యువతకు ఉపాధి కల్పన కి కృషి చేస్తున్నామన్నారు.

Trisha: విజయ్‌ కోసం రూల్‌ బ్రేక్‌ చేసిన త్రిష!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ దేశ చరిత్రలో ఎవరూ కూడా ఆలోచన చేసి ఉండరని, పెద్ద ఎత్తున ఈ స్కూల్స్ మొట్ట మొదటి సారి మొదటి సంవత్సరంలోనే రూ. 5 వేల కోట్లతో నిధులు ఖర్చుపెట్టబోంతోందన్నారు. రాష్ట్రంలో గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్‌ఫ్రాస్టక్షర్ కోసం సంవత్సరానికి రూ.3 కోట్లు ఖర్చుపెట్టేదని, కానీ ఈ సంవత్సరం మేము రూ. 5 వేల కోట్లకు పెంచామని ఇది మా ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. విద్య కోసం అంగన్వాడి దగ్గర నుంచి మొదలు కొని ప్రణాళికలు తయారు చేశామని వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ పై ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు నేడు రాష్ట్రానికి 4వ సిటీ రాబోతుందని, ఆ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇండస్ట్రీలకు అనుగుణంగా సిలబస్‌ను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ వర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. దాదాపు రాష్ట్రంలోని 63 ఐటీఐలు కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ఐటీఐలను అడ్వాన్స్ స్కిల్ సెంటర్‌లుగా భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.

Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?