మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. సాధారణంగా థియేటర్ విడుదలైన సినిమాలు 4 నుంచి 6 వారాల్లో ఓటిటిలోకి వస్తాయి. అయితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విషయంలో స్ట్రీమింగ్ కాలేదు.
Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్ పై గందరగోళం
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జీ 5 కొనుగోలు చేసింది. ఆ మధ్య స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. అనేక మార్లు ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేసిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్కు తీసుకురాబోతున్నారు. థియేటర్ రిలీజ్కు సుమారు 59 రోజుల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్కు రానుండటం గమనార్హం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎక్కువ OTT విండోకి మధ్యలో ఎదురైన కొన్ని ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం లేదా ఓటిటి ప్లాట్ఫామ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ సారైనా ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుందో లేదా మరోసారి వాయిదా వేస్తారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరి ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
