Bengaluru Stampede: విజయోత్సవాలు వద్దని చెప్పాం.. ఆర్సీబీ వినలేదు!
- అహ్మదాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు ఆర్సీబీ
- విధానసౌధ ప్రాంగణంలో ఆర్సీబీ క్రికెటర్లకు సన్మానం
- చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
- విజయోత్సవాలు వద్దని సూచించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంది. విధానసౌధ ప్రాంగణంలో ఆర్సీబీ క్రికెటర్లను సన్మానించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో.. టీమ్ బస్సు సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకుంది. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఏర్పాటు చేసింది.
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ రద్దు కావడంతో అందరూ చిన్నస్వామి స్టేడియంకు చేరుకున్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు కాగా… ఏకంగా మూడు లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. అదే సమయంలో వర్షం పడటంతో సాయంత్రం 4 గంటల సమయంలో గేటు వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో పోలీసులు చేతులెత్తేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వేడుకలు వాయిదా వేయాలని పోలీసులు సూచించినా.. ఆర్సీబీ యాజమాన్యం నిర్వహణకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Also Read
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
- PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
Also Read: Hero Vishal: హీరో విశాల్కు బిగ్ షాక్.. 30 శాతం వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ..!
వేడుకలు, ర్యాలీ వద్దని ఆర్సీబీ యాజమాన్యంకు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ‘బుధవారం వేడుకలు, ర్యాలీ వద్దని ఆర్సీబీ యాజమాన్యం, ప్రభుత్వానికి మంగళవారం రాత్రే సూచించాం. ప్రస్తుతం అభిమానులు తీవ్ర ఉద్వేగంతో ఉన్నారని, కాస్త చల్లబడిన తర్వాత వేడుకలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశాం. ర్యాలీ వద్దని, ఒక ప్రాంతంలో వేడుకలు నిర్వహించాలని సూచించాం. విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఆర్సీబీ యాజమాన్యం కార్యక్రమం నిర్వహణకే మొగ్గు చూపింది’ అని సదరు పోలీసు అధికారి చెప్పారు. పోలీసు అధికారి మాటలను బట్టి చూస్తే.. ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు కారణంగానే విషాదం నెలకొందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!