Congress: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన ప్రశ్నలు
- బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత కవచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 7 పదునైన ప్రశ్నలు సంధించారు. భారతీయ రైల్వేల నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బెంగాల్ లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మల్లికార్జున్ ఖర్గే ఎక్స్లో స్పందిస్తూ.. ‘రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా, ప్రస్తుత రైల్వే మంత్రి కెమెరాలతో పకడ్బందీగా సంఘటనా స్థలానికి చేరుకుని, అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు” అని పేర్కొన్నారు.
Pumpkin Seeds : ఆ గింజలను రోజుకు పది తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన 7 ప్రశ్నలు..
1. బాలాసోర్ వంటి పెద్ద ప్రమాదం తర్వాత.. కవచ్ రక్షణలో ఒక్క కిలోమీటరు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
2. రైల్వేలో దాదాపు 3 లక్షల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి.. గత 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు.. ?
3. NCRB (2022) నివేదిక ప్రకారం.. 2017-2021 మధ్యకాలంలో 1,00,000 మంది రైల్వే ప్రమాదాల్లో మరణించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.? మానవ వనరుల కొరత కారణంగా లోకో పైలట్లు ఎక్కువ గంటలు పనిచేయడమే ప్రమాదాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని ఇటీవల రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించింది. అలాంటప్పుడు పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు..?
4. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. తన 323వ నివేదికలో రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) సిఫార్సుల పట్ల రైల్వే బోర్డు చూపిన ‘నిర్లక్ష్యానికి’ రైల్వేలను విమర్శించింది. CRS 8%-10% ప్రమాదాలపై మాత్రమే దర్యాప్తు చేస్తుందని.. CRS ఎందుకు బలోపేతం కాలేదు అని ప్రశ్నించింది..?
5. కాగ్ ప్రకారం.. జాతీయ రైల్వే భద్రతా నిధి (RRSK)లో 75% నిధులు ఎందుకు జరిగాయి. ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లు అందుబాటులో ఉంచాలి. ఈ డబ్బును రైల్వే అధికారులు అనవసర ఖర్చులు, సౌకర్యాల కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు..?
6. సాధారణ స్లీపర్ క్లాస్ ద్వారా రైలులో ప్రయాణించడం ఎందుకు చాలా ఖరీదైనదిగా మారింది..? స్లీపర్ కోచ్ల సంఖ్యను ఎందుకు తగ్గించారు..? రైల్వే కోచ్లలో రద్దీకి కారణమయ్యే వారిపై పోలీసు బలగాలను ఉపయోగించడం గురించి రైల్వే మంత్రి ఇటీవల మాట్లాడారు. అయితే గత ఏడాది 2.70 కోట్ల మంది సీట్ల కొరత కారణంగా తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని.. కోచ్ల సంఖ్యను తగ్గించే మోడీ ప్రభుత్వ విధానానికి ప్రత్యక్ష ఫలితం అని వారికి తెలియదా..?
7. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం.. 2017-18లో రైల్వేబడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిందా..? ప్రజానీకాకి సమాధానం కావాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!