Congress: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన ప్రశ్నలు
- బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత కవచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 7 పదునైన ప్రశ్నలు సంధించారు. భారతీయ రైల్వేల నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బెంగాల్ లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మల్లికార్జున్ ఖర్గే ఎక్స్లో స్పందిస్తూ.. ‘రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా, ప్రస్తుత రైల్వే మంత్రి కెమెరాలతో పకడ్బందీగా సంఘటనా స్థలానికి చేరుకుని, అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు” అని పేర్కొన్నారు.
Pumpkin Seeds : ఆ గింజలను రోజుకు పది తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..
Also Read
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన 7 ప్రశ్నలు..
1. బాలాసోర్ వంటి పెద్ద ప్రమాదం తర్వాత.. కవచ్ రక్షణలో ఒక్క కిలోమీటరు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
2. రైల్వేలో దాదాపు 3 లక్షల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి.. గత 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు.. ?
3. NCRB (2022) నివేదిక ప్రకారం.. 2017-2021 మధ్యకాలంలో 1,00,000 మంది రైల్వే ప్రమాదాల్లో మరణించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.? మానవ వనరుల కొరత కారణంగా లోకో పైలట్లు ఎక్కువ గంటలు పనిచేయడమే ప్రమాదాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని ఇటీవల రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించింది. అలాంటప్పుడు పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు..?
4. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. తన 323వ నివేదికలో రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) సిఫార్సుల పట్ల రైల్వే బోర్డు చూపిన ‘నిర్లక్ష్యానికి’ రైల్వేలను విమర్శించింది. CRS 8%-10% ప్రమాదాలపై మాత్రమే దర్యాప్తు చేస్తుందని.. CRS ఎందుకు బలోపేతం కాలేదు అని ప్రశ్నించింది..?
5. కాగ్ ప్రకారం.. జాతీయ రైల్వే భద్రతా నిధి (RRSK)లో 75% నిధులు ఎందుకు జరిగాయి. ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లు అందుబాటులో ఉంచాలి. ఈ డబ్బును రైల్వే అధికారులు అనవసర ఖర్చులు, సౌకర్యాల కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు..?
6. సాధారణ స్లీపర్ క్లాస్ ద్వారా రైలులో ప్రయాణించడం ఎందుకు చాలా ఖరీదైనదిగా మారింది..? స్లీపర్ కోచ్ల సంఖ్యను ఎందుకు తగ్గించారు..? రైల్వే కోచ్లలో రద్దీకి కారణమయ్యే వారిపై పోలీసు బలగాలను ఉపయోగించడం గురించి రైల్వే మంత్రి ఇటీవల మాట్లాడారు. అయితే గత ఏడాది 2.70 కోట్ల మంది సీట్ల కొరత కారణంగా తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని.. కోచ్ల సంఖ్యను తగ్గించే మోడీ ప్రభుత్వ విధానానికి ప్రత్యక్ష ఫలితం అని వారికి తెలియదా..?
7. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం.. 2017-18లో రైల్వేబడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిందా..? ప్రజానీకాకి సమాధానం కావాలి.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!