Congress: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు
- మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన ప్రశ్నలు
- బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత కవచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 7 పదునైన ప్రశ్నలు సంధించారు. భారతీయ రైల్వేల నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బెంగాల్ లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మల్లికార్జున్ ఖర్గే ఎక్స్లో స్పందిస్తూ.. ‘రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా, ప్రస్తుత రైల్వే మంత్రి కెమెరాలతో పకడ్బందీగా సంఘటనా స్థలానికి చేరుకుని, అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు” అని పేర్కొన్నారు.
Pumpkin Seeds : ఆ గింజలను రోజుకు పది తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై సంధించిన 7 ప్రశ్నలు..
1. బాలాసోర్ వంటి పెద్ద ప్రమాదం తర్వాత.. కవచ్ రక్షణలో ఒక్క కిలోమీటరు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు..?
2. రైల్వేలో దాదాపు 3 లక్షల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి.. గత 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు.. ?
3. NCRB (2022) నివేదిక ప్రకారం.. 2017-2021 మధ్యకాలంలో 1,00,000 మంది రైల్వే ప్రమాదాల్లో మరణించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.? మానవ వనరుల కొరత కారణంగా లోకో పైలట్లు ఎక్కువ గంటలు పనిచేయడమే ప్రమాదాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని ఇటీవల రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించింది. అలాంటప్పుడు పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు..?
4. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. తన 323వ నివేదికలో రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) సిఫార్సుల పట్ల రైల్వే బోర్డు చూపిన ‘నిర్లక్ష్యానికి’ రైల్వేలను విమర్శించింది. CRS 8%-10% ప్రమాదాలపై మాత్రమే దర్యాప్తు చేస్తుందని.. CRS ఎందుకు బలోపేతం కాలేదు అని ప్రశ్నించింది..?
5. కాగ్ ప్రకారం.. జాతీయ రైల్వే భద్రతా నిధి (RRSK)లో 75% నిధులు ఎందుకు జరిగాయి. ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లు అందుబాటులో ఉంచాలి. ఈ డబ్బును రైల్వే అధికారులు అనవసర ఖర్చులు, సౌకర్యాల కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు..?
6. సాధారణ స్లీపర్ క్లాస్ ద్వారా రైలులో ప్రయాణించడం ఎందుకు చాలా ఖరీదైనదిగా మారింది..? స్లీపర్ కోచ్ల సంఖ్యను ఎందుకు తగ్గించారు..? రైల్వే కోచ్లలో రద్దీకి కారణమయ్యే వారిపై పోలీసు బలగాలను ఉపయోగించడం గురించి రైల్వే మంత్రి ఇటీవల మాట్లాడారు. అయితే గత ఏడాది 2.70 కోట్ల మంది సీట్ల కొరత కారణంగా తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని.. కోచ్ల సంఖ్యను తగ్గించే మోడీ ప్రభుత్వ విధానానికి ప్రత్యక్ష ఫలితం అని వారికి తెలియదా..?
7. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం.. 2017-18లో రైల్వేబడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిందా..? ప్రజానీకాకి సమాధానం కావాలి.
తాజావార్తలు
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!