బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా రెండు భారీ విజయాలను అందుకొని తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు.ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ మూవీ ఏకంగా వెయ్యికోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటించారు.2023 జనవరి 25న హిందీతో పాటు తమిళం మరియు తెలుగులో కూడా విడుదలై పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే పఠాన్ రిలీజ్ కు ముందు షారుఖ్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత షారుఖ్ జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సౌత్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీ తెరకెక్కింది. జవాన్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. జవాన్ కూడా 1000కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.జవాన్ సినిమా రిలీజ్ కు ముందు కూడా షారుఖ్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు మూడో సారి షారుఖ్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన నటించిన డంకి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో సెంటిమెంట్ గా ఈ సినిమా రిలీజ్ కు ముందు షారుక్ ఇలా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకు పోటీగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22 న విడుదల అవుతుంది. దీనితో ఈ రెండు బిగ్గెస్ట్ మూవీస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగనుంది.