Site icon NTV Telugu

Bank Of Baroda: వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్న బ్యాంక్..

Bob

Bob

Bank Of Baroda: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో దుర్వినియోగం అయిన 67 లక్షల 52 వేల రూపాయలు వసూలు చేసారు బ్యాంకు అధికారులు. ఈ సొమ్ముని నేటి నుండి వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన 64 ఖాతాల చెందిన దుర్వినియోగమైన రూ. 64,06,757 లను రికవరి చేసారు బ్యాంకు అధికారులు. ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలియచేసారు.

Boats at Prakasam Barrage: నేడు బోట్ల తొలగింపుకు మరోసారి ప్రయత్నం..

డిఆర్డిఎతూర్పుగోదావరి జిల్లాలోని జి. యర్రంపాలెం బ్రాంచ్‌లోని వారి ఖాతాల్లోకి సంబంధిత డిపాజిట్‌లను జమ చేయడంలో బిజినెస్ కరస్పాండెంట్ విఫలమవడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా 64 స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) రూ. 67.52 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. డిఆర్డిఎ సమక్షంలో సదరు చెల్లింపుల ప్రక్రియను సజావుగా బ్యాంకు బ్రాంచి నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు అధికారులు.సమక్షంలో సదరు చెల్లింపుల ప్రక్రియను సజావుగా బ్యాంకు బ్రాంచి నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు అధికారులు.

Viral Video: ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్.. షాక్‌తో చూస్తుండిపోయిన ఐఏఎస్ టీనా దాబీ..

Exit mobile version