Site icon NTV Telugu

Bangladesh : బంగ్లాదేశ్‎లో మరోసారి రాజుకున్న అగ్గి… రాత్రంతా హల్ చల్ చేసిన ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్

New Project (81)

New Project (81)

Bangladesh : బంగ్లాదేశ్ ఇప్పుడు తను పెట్టుకున్న నిప్పుకు తానే ఆహుతి అవుతుంది. దేశ రాజధాని ఢాకాలో రాత్రిపూట విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని నియంత్రించడంలో పరిపాలన నిస్సహాయంగా ఉండిపోయింది, ఆ తరువాత బోర్డర్ గార్డ్ ఫోర్స్‌ను మోహరించాల్సి వచ్చింది. ఢాకా యూనివర్సిటీ (DU), ఏడు అనుబంధ ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఉద్రిక్తత ఇప్పటికీ కొనసాగుతోంది. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఘర్షణల్లో కనీసం ఐదుగురు గాయపడ్డారు.

అనుబంధ కళాశాలల నుండి వందలాది మంది విద్యార్థులు సైన్స్ ల్యాబ్ క్రాసింగ్ వద్ద దాదాపు నాలుగున్నర గంటల పాటు ధర్నా చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది. వారి నిరసన ఢాకా యూనివర్సిటీ పరిపాలన ముందు ఉంచిన ఐదు డిమాండ్లపై ఆధారపడింది. ఆదివారం రాత్రి 3.30 గంటల ప్రాంతంలో నిరసనకారులు ఢాకా యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మామున్ అహ్మద్ నివాసం వైపు పరేడ్ చేసి, నీల్ఖెట్ స్క్వేర్ వద్ద నిరసనను కొనసాగించారు.

Read Also:Fake Notes in ATM: ఏటీఎంలో దొంగ నోట్ల కలకలం..

బంగ్లాదేశ్ మీడియా ప్రకారం..వందలాది మంది విద్యార్థులు అనేక హాళ్ల నుండి బయటకు వచ్చి నీల్ఖేట్ స్క్వేర్ నుండి నిరసన తెలుపుతున్న విద్యార్థులను తరిమికొట్టడంతో పరిస్థితి మరింత దిగజారింది. అనుబంధ కళాశాల విద్యార్థులు మళ్ళీ ఐక్యమై డీయూ విద్యార్థులను తరిమికొట్టారు. అర్ధరాత్రి సమయానికి పోలీసులు జోక్యం చేసుకుని, జనసమూహాన్ని చెదరగొట్టడానికి, తీవ్రతరం అవుతున్న పరిస్థితిని నియంత్రించడానికి సౌండ్ గ్రెనేడ్లను విసిరారు. శాంతిభద్రతలను కాపాడటానికి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) సిబ్బందికి చెందిన నాలుగు బృందాలను మోహరించారు.

Read Also: Prithviraj : రజినీకాంత్‌తో సినిమా జస్ట్ మిస్ : పృథ్వీరాజ్

విద్యార్థుల డిమాండ్లు..
* 2024-25 విద్యా సంవత్సరం నుండి ఏడు కళాశాలల ప్రవేశ పరీక్షలో అసమంజసమైన కోటా విధానాన్ని రద్దు చేయడం.
* ప్రవేశాలు తరగతి సామర్థ్యాన్ని మించకుండా చూసుకోవడం.
* ప్రవేశాలలో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవడం.
* ప్రవేశ పరీక్షలో తప్పు సమాధానాలకు మార్కుల కోత.
* పారదర్శకతను నిర్ధారించడానికి డీయూ నుండి వేరుగా ఉన్న ఖాతాలో ప్రవేశ రుసుములను జమ చేయడం.

Exit mobile version