Bangladesh News : బంగ్లాదేశ్లో జైలు పై దాడి.. 500 మందికి పైగా ఖైదీలు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh News : ప్రస్తుతం పొరుగుదేశం బంగ్లాదేశ్లో గందరగోళం నెలకొని ఉంది. రెండు నెలలుగా విద్యార్థులు రిజర్వేషన్ల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆ తర్వాత సోమవారం (ఆగస్టు 5) బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనల కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్లుగా ఆమె ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, విద్యార్థులు సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు.
Read Also:CM Revanth Reddy: ఆయన పాట ప్రజా యుద్ధ నౌక.. గద్దర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తరువాత, దేశ పరిస్థితి, వ్యవస్థ పతనమైంది. ఆ తర్వాత దేశంలోని జైళ్లు కూడా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి దేశంలో కర్ఫ్యూ విధించింది. అయితే సోమవారం ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో అగంతకులు పగటిపూట కర్రలతో జైలులోకి ప్రవేశించారు. ఉత్తర బంగ్లాదేశ్లోని షేర్పూర్ జిల్లాలోని జైలు నుంచి దాదాపు 500 మంది ఖైదీలు దుండగుల సాయంతో పరారయ్యారు.
Read Also:INDIA Alliance: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన.. ఎందుకో తెలుసా..?
పోలీస్ స్టేషన్కు నిప్పు
షేర్పూర్ మాత్రమే కాదు, దామ్దామా కాలిగంజ్ ప్రాంతంలోని జైలులోకి కూడా ప్రజలు ప్రవేశించి జైలుకు నిప్పు పెట్టారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జైలుపై దాడి జరిగిందని షేర్పూర్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్లా అల్ ఖైరున్ తెలిపారు. అలాంటి విధ్వంసకర దృశ్యం సోమవారం బంగ్లాదేశ్లో కనిపించింది. ఆగ్రహించిన గుంపు జైలునే కాకుండా పోలీసు స్టేషన్ను కూడా లక్ష్యంగా చేసుకుంది. సుమారు 1 గంట సమయంలో సదర్ పోలీస్ స్టేషన్కు ప్రజలు నిప్పు పెట్టారు. ఆ గుంపు జిల్లా పరిషత్, జిల్లా ఎన్నికల కార్యాలయం, సోనాలి బ్యాంక్, అనేక దుకాణాలను కూడా ధ్వంసం చేసింది. షేక్ హసీనా, భారతదేశం మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆమె బంగ్లాదేశ్ నుండి పొరుగు దేశం భారతదేశానికి నేరుగా బయలుదేరింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్లవచ్చని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!