Bangladesh News : బంగ్లాదేశ్లో జైలు పై దాడి.. 500 మందికి పైగా ఖైదీలు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh News : ప్రస్తుతం పొరుగుదేశం బంగ్లాదేశ్లో గందరగోళం నెలకొని ఉంది. రెండు నెలలుగా విద్యార్థులు రిజర్వేషన్ల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆ తర్వాత సోమవారం (ఆగస్టు 5) బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనల కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్లుగా ఆమె ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, విద్యార్థులు సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు.
Read Also:CM Revanth Reddy: ఆయన పాట ప్రజా యుద్ధ నౌక.. గద్దర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తరువాత, దేశ పరిస్థితి, వ్యవస్థ పతనమైంది. ఆ తర్వాత దేశంలోని జైళ్లు కూడా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి దేశంలో కర్ఫ్యూ విధించింది. అయితే సోమవారం ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో అగంతకులు పగటిపూట కర్రలతో జైలులోకి ప్రవేశించారు. ఉత్తర బంగ్లాదేశ్లోని షేర్పూర్ జిల్లాలోని జైలు నుంచి దాదాపు 500 మంది ఖైదీలు దుండగుల సాయంతో పరారయ్యారు.
Read Also:INDIA Alliance: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన.. ఎందుకో తెలుసా..?
పోలీస్ స్టేషన్కు నిప్పు
షేర్పూర్ మాత్రమే కాదు, దామ్దామా కాలిగంజ్ ప్రాంతంలోని జైలులోకి కూడా ప్రజలు ప్రవేశించి జైలుకు నిప్పు పెట్టారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జైలుపై దాడి జరిగిందని షేర్పూర్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్లా అల్ ఖైరున్ తెలిపారు. అలాంటి విధ్వంసకర దృశ్యం సోమవారం బంగ్లాదేశ్లో కనిపించింది. ఆగ్రహించిన గుంపు జైలునే కాకుండా పోలీసు స్టేషన్ను కూడా లక్ష్యంగా చేసుకుంది. సుమారు 1 గంట సమయంలో సదర్ పోలీస్ స్టేషన్కు ప్రజలు నిప్పు పెట్టారు. ఆ గుంపు జిల్లా పరిషత్, జిల్లా ఎన్నికల కార్యాలయం, సోనాలి బ్యాంక్, అనేక దుకాణాలను కూడా ధ్వంసం చేసింది. షేక్ హసీనా, భారతదేశం మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆమె బంగ్లాదేశ్ నుండి పొరుగు దేశం భారతదేశానికి నేరుగా బయలుదేరింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్లవచ్చని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!