Bangladesh: షేక్ హసీనా పారిపోయిన రోజు, బంగ్లాదేశ్లో సంస్కరణల జాబితా..
- ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా షేక్ హసీనా పారిపోయిన రోజు..
- అదే రోజు సంస్కరణల జాబితాకు యూనస్ సర్కార్ రంగం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, ప్రజాస్వామ్య సవరణల జాబితాను విడుదల చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం తెలిపింది.
Read Also: Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
Also Read
- Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
- Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
- India vs Sri Lanka: గంభీర్కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
ఈ సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీల ఆమోదం కోసం ముసాయిదా కాపీలను పంపారు. ప్రధాన సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ..వచ్చే మంగళవారం ఆగస్టు 5 సాయంత్ర 5 గంటలకు జరిగే వేడుకల్లో అన్ని పార్టీల సమక్షంలో ఈ సంస్కరణలను దేశం ముందు ఉంచుతాం అని చెప్పారు. బంగ్లాదేశ్ జాతీయ ఏకాభిప్రాయ కమిషన్ నిర్వహించిన చర్చల్లో, 23 ప్రాథమిక సంస్కరణల్లో 19పై ఏకాభిప్రాయం, నిర్ణయాలు కుదిరినట్లు తెలుస్తోంది. 8 అంశాలపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, 11 అంశాలపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
గతేడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం మొదలైంది. వేలాది మంది నిరసనకారులు హసీనా ప్యాలెస్ని ముట్టడించారు. అప్పటికే ఆమె, ప్రత్యేక విమానంలో భారత్ చేరింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుతీరింది. 2024 వరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేసయకుండా యూనస్ సర్కార్ నిషేధించింది. ఏప్రిల్ 2026లో ఎన్నికలు జరుపుతామని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంస్కరణలపై అంతా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!