Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. రంగ్పూర్లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని నిలిపివేయడంతో ప్రభుత్వంపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఈ విగ్రహా నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో హిందువులు రోడ్లపైకి వచ్చారు. శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మతోన్మాదుల నుంచి బెదిరింపులు వచ్ంచాయి. భద్రతా కారణాలతో ఈ నిర్మానాన్ని తాత్కాలికగంగా నిలిపేశారు.
ఈ నేపథ్యంలో ఢాకాలోని షాహ్భాగ్ కూడలి వద్ద హిందువులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. హిందూ మహాజోట్ పిలుపు మేరకు వేలాది మంది హిందువులు, విద్యార్థులు నిరసనకు దిగారను. హిందూ సంస్థలు, హిందువులు మానవహారాలు, దీపాలతో ర్యాలీ నిర్వహించారు. ఇదే కాకుండా, ఇటీవల విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిస్టులు జరిపిన ర్యాలీలో, శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారు. ఇది కూడా హిందువుల్లో ఆగ్రహానికి కారణమైంది. బాధ్యులను 72 గంటల్లో అరెస్ట్ చేయాలని హిందువులు ప్రభుత్వానికి అల్టి్మేటం విధించారు. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదే విధంగా రాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోతే, బంగ్లాదేశ్లోని 64 జిల్లాల్లో ఒక్కో రామాలయం నిర్మిస్తామని హిందూ మహాజోట్ ప్రకటించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ సముదాయంలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహంతో పాటు 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీని పనులు దాదాపు 80 శాతం పూర్తయినట్లు ఆలయ కమిటీ తెలిపింది. బంగ్లాదేశ్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు. దేశ జనాభాలో 8 శాతం ఉన్నారు.

