Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఇటీవల రోజుల్లో భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అది మంచి విషయాలతో అయితే కాదు.. గతంలో బంగ్లాదేశ్లో హిందువు (దీపు చంద్ర దాస్)ను చంపిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం బంగ్లాదేశ్లో హిందువులపై మరో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఒక గుంపు ఈ రోజు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ను కొట్టి చంపింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి వయసు 29 సంవత్సరాలు.
READ ALSO: Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్లైన్ పెట్టిన మంత్రి..
Also Read
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ఈ సంఘటన రాజ్బరి జిల్లాలో జరిగింది. పాంగ్షా మోడల్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు అమృత్ మండల్ను దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారని, ఇది మూక హింసగా మారిందని తెలిపారు. అమృత్ మండల్ “సామ్రాట్ వాహిని” అనే స్థానిక ముఠాకు నాయకుడిగా ఉన్నాడు. మంగళవారం చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇల్లు తగలబెట్టారు. రౌజన్ ప్రాంతంలో ఐదు రోజుల్లో ఏడు హిందూ కుటుంబాల ఇళ్లు తగలబెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత వారం మైమెన్సింగ్ నగరంలో ఒక గుంపు 28 ఏళ్ల హిందూ కార్మికుడు దీపు చంద్ర దాస్ను దైవదూషణ ఆరోపణతో కొట్టి చంపింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మృతుడి భార్య, వారి చిన్న పిల్లలు, తల్లిదండ్రులను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.
ఇప్పటి వరకు 184 మంది మృతి
బంగ్లాదేశ్లో ఈ హింస, దాడుల కారణంగా ఇప్పటి వరకు 184 మంది మృతి చెందారు. డిసెంబర్ 12న ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది ఢాకాలో కాల్చి చంపబడ్డాడు. సింగపూర్లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. అదే సాయంత్రం జనసమూహం డైలీ స్టార్, ప్రథమ్ అలో కార్యాలయాలకు నిప్పు పెట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంస్థలు ఛాయనాత్, ఉడిచి శిల్పి గోష్తి కార్యాలయాలను కూడా తగలబెట్టారు. 2025లో ఇప్పటివరకు బంగ్లాదేశ్లో నెలకొన్న హింస కారణంగా 184 మంది మరణించారని మానవ హక్కుల సంస్థ నివేదించింది.
READ ALSO: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?