Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఇటీవల రోజుల్లో భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అది మంచి విషయాలతో అయితే కాదు.. గతంలో బంగ్లాదేశ్లో హిందువు (దీపు చంద్ర దాస్)ను చంపిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం బంగ్లాదేశ్లో హిందువులపై మరో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఒక గుంపు ఈ రోజు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ను కొట్టి చంపింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి వయసు 29 సంవత్సరాలు.
READ ALSO: Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్లైన్ పెట్టిన మంత్రి..
Also Read
- The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ఈ సంఘటన రాజ్బరి జిల్లాలో జరిగింది. పాంగ్షా మోడల్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు అమృత్ మండల్ను దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారని, ఇది మూక హింసగా మారిందని తెలిపారు. అమృత్ మండల్ “సామ్రాట్ వాహిని” అనే స్థానిక ముఠాకు నాయకుడిగా ఉన్నాడు. మంగళవారం చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇల్లు తగలబెట్టారు. రౌజన్ ప్రాంతంలో ఐదు రోజుల్లో ఏడు హిందూ కుటుంబాల ఇళ్లు తగలబెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత వారం మైమెన్సింగ్ నగరంలో ఒక గుంపు 28 ఏళ్ల హిందూ కార్మికుడు దీపు చంద్ర దాస్ను దైవదూషణ ఆరోపణతో కొట్టి చంపింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మృతుడి భార్య, వారి చిన్న పిల్లలు, తల్లిదండ్రులను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.
ఇప్పటి వరకు 184 మంది మృతి
బంగ్లాదేశ్లో ఈ హింస, దాడుల కారణంగా ఇప్పటి వరకు 184 మంది మృతి చెందారు. డిసెంబర్ 12న ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది ఢాకాలో కాల్చి చంపబడ్డాడు. సింగపూర్లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. అదే సాయంత్రం జనసమూహం డైలీ స్టార్, ప్రథమ్ అలో కార్యాలయాలకు నిప్పు పెట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంస్థలు ఛాయనాత్, ఉడిచి శిల్పి గోష్తి కార్యాలయాలను కూడా తగలబెట్టారు. 2025లో ఇప్పటివరకు బంగ్లాదేశ్లో నెలకొన్న హింస కారణంగా 184 మంది మరణించారని మానవ హక్కుల సంస్థ నివేదించింది.
READ ALSO: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!