Site icon NTV Telugu

Vegetarian Orders: వెజ్‌ ఫుడ్‌కి ఫుల్‌ డిమాండ్‌.. టాప్‌ 3లో హైదరాబాద్‌.. ఎక్కువ ఆర్డర్లు వీటికే..

Swiggy

Swiggy

Vegetarian Orders: ఆన్‌లైన్‌ ఫుడ్‌ అనగానే ఎక్కువగా నాన్‌వెజ్‌ వైపే మొగ్గుచూపుతారని అనుకుంటాం.. కానీ, వెజ్‌కు కూడా మంచి డిమాండే ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్‌ అనగానే.. ముక్కలేనిది ముద్ద దిగదు అనే మాట వినిపడుతుంది.. అలాంటిది.. వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్లలో టాప్‌ 3లో నిలిచింది మన మహానగరం.. పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.. స్విగ్గీ యొక్క అంతర్గత డేటా విశ్లేషణను విడుదల చేసింది. దాని ప్రకారం.. భారత్‌లోని ఈ సిటీలు అత్యధిక శాఖాహార ఆర్డర్‌లు కలిగి ఉన్నాయి..

Read Also: Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..

స్విగ్గి శాఖాహార ఆహార ఆర్డర్లపై అంతర్గత విశ్లేషణ ఫలితాలను విడుదల చేసింది. ఏ నగరంలో అత్యధిక వెజ్ ఆర్డర్‌లు ఉన్నాయో తెలిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. బెంగుళూరు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది వెజ్జీ వ్యాలీ కూడా అంటూ పేర్కొంది.. ప్రతి మూడు శాకాహార స్విగ్గీ ఆర్డర్‌లలో ఒకటి బెంగళూరు నగరం నుండేనని నివేదిక వెల్లడించింది. ఇక, ఆ ఆర్డర్లలో మసాలా దోస, పనీర్ బిర్యానీ మరియు పనీర్ బటర్ మసాలా బెంగుళూరులో స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన టాప్ వెజ్ వంటకాలుగా పేర్కొంది..

Read Also: Karnataka Health Minister: జైపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే

ఇక, రెండవ అత్యధిక వెజ్ ఆర్డర్‌లను కలిగి ఉన్న సిటీ ముంబై అని పేర్కొంది స్విగ్గీ.. ఇక్కడ టాప్‌ వంటకాల విషయానికి వస్తే.. దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ ఉన్నాయని తెలిపింది. ఈ ‘ర్యాంకింగ్’లో మూడవ స్థానం హైదరాబాద్ ఆక్రమించింది.. ఇక్కడ మసాలా దోస మరియు ఇడ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఆర్డర్‌లుగా స్విగ్గీ వెల్లడించింది.. దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమేనని అని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. మసాలా దోస, పనీర్ బటర్ మసాలా, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ టాప్‌లో ఉన్నాయి.

Read Also: TB BCG Vaccines in AP: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..

ఈ ప్లాట్‌ఫారమ్‌లో 90 శాతం కంటే ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్‌లు శాఖాహారం కాబట్టి, ఇది అల్పాహారాన్ని “శాఖాహార ఆర్డర్‌లకు గోల్డెన్ అవర్” అని పిలిచింది. మసాలా దోస, వడ, ఇడ్లీ మరియు పొంగల్ అత్యంత ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌ వంటకాలు. అయినప్పటికీ, “మసాలా దోస దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని చెప్పాలి.. బ్రేక్‌ఫాస్ట్‌ , లంచ్ మరియు డిన్నర్ కోసం ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక” అని హైలైట్ చేసింది. ఇక, స్విగ్గీలో వారానికి 60,000 వెజ్ సలాడ్‌లు ఆర్డర్ చేయబడతాయని తెలిపింది..

Exit mobile version