Bandi Sanjay: సింహం సింగిల్గానే వస్తుంది.. ఎగిరేది బీజేపీ జెండానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఏ సర్వేలు చూసినా ములుగులో ఎగిరేది బీజేపీ జెండానే అని స్పష్టంగా తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ములుగు జిల్లా పోలింగ్ బూత్ సమ్మేళన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. సర్వేలన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయంటూ ఆరోపించారు.
Read Also: SRH vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న సన్రైజర్స్
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
చివరికి కేసీఆర్ సర్వే కూడా బీజేపీ దే విజయం అని తేల్చిందన్నారు. పాలించమని కేసీఆర్కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఉన్న పరిశ్రమలే మూతపడే స్థితికి తీసుకొచ్చాడన్నారు. కేసీఆర్ పరిశ్రమలు మూసివేయిస్తుంటే మోడీ రామగుండంలో మూతపడ్డ యూరియా ఫ్యాక్టరీని ఓపెన్ చేయించారన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తా అన్నారు. గిరిజన బిడ్డ మొదటి సారి రాష్ట్రపతి అవుతుంటే అడ్డుకునే కుట్ర చేశారంటూ ఆరోపించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేల కోట్లు కెసిఆర్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలన్నాడు. రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువచ్చాడని, మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం మరింతం దిగజారుతుందన్నారు.
Read Also: Rangareddy Crime: చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు మృతి
మోదీ దేశాన్ని శక్తి వంతమైన దేశంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. కెసిఆర్ తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగించేందుకు కుట్ర చేస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి, కులానికి కొమ్ము కాయదు. అలాగని హిందూ సమాజానికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. మతచందస వాదులకు వ్యతిరేకమన్నారు. ఎక్కడ పచ్చ జెండాలు ఎగిరాయో అక్కడ కాషాయ జెండాలు ఎగరేసిన ఘనత బీజేపీ ది. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్న సంజయ్.. రుణమాఫీ, నిరుద్యోగ భృతి వెంటనే క్లియర్ చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధి్కి ఎన్నికోట్లు ఖర్చు చేశారో కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!