Delhi : ఢిల్లీలోని 493 ఆసుపత్రుల్లో వృద్ధులకు ఉచిత చికిత్స.. వారికి లభించే ప్రయోజనాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : దీపావళికి ముందు దేశంలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు మోదీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఇప్పుడు ఏ వర్గానికి చెందిన పెద్దలు, వారి ఆదాయంతో సంబంధం లేకుండా, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ పథకం కింద వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తారు. వృద్ధులు చికిత్స ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించడమే దీని లక్ష్యం.
ఢిల్లీలోని ఆయుష్మాన్ యోజన హాస్పిటల్స్
పీఎం ఆయుష్మాన్ వయ వందన యోజన ప్రయోజనం ఢిల్లీలోని 493 ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుంది. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అధికారిక వెబ్సైట్లో ఈ పథకంలో చేర్చబడిన ఆసుపత్రుల పూర్తి జాబితాను చూడవచ్చు. ఢిల్లీలోని కొన్ని ఎంపిక చేసిన ఆసుపత్రుల గురించి మాట్లాడుకుంటే.. సఫ్దర్జంగ్ హాస్పిటల్, ఎయిమ్స్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, గురు గోవింద్ సింగ్ హాస్పిటల్ వంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also:Elon Musk: వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోవడం ఖాయం..కెనడా ప్రధానిపై మస్క్ విమర్శలు
70 ఏళ్లు పైబడిన వారి కోసం కొత్త పథకం
70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించారు. వృద్ధులందరికీ మెరుగైన వైద్యం అందించడమే దీని లక్ష్యం. ఈ పథకంలో ఆదాయ పరిమితి లేదు, అంటే వృద్ధులెవరైనా దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. దీంతో వృద్ధులకు చికిత్స ఖర్చుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు సులువుగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది.
‘ఆయుష్మాన్ వయ వందన కార్డ్’ అంటే ఏమిటి?
ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం కొత్త కార్డ్ తయారు చేయబడుతుంది. దీనిని ‘ఆయుష్మాన్ వయ వందన కార్డ్’ అని పిలుస్తారు. ఈ కార్డుతో వృద్ధులకు ఆస్పత్రిలో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. వృద్ధులు దీని ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఈ కార్డు చికిత్స ఖర్చులలో చాలా సహాయపడుతుంది. వృద్ధ దంపతులు ఉంటే ఇద్దరికీ కలిపి రూ.5 లక్షల వైద్యం అందుతుంది.
Read Also:No Smoking: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలలో, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం నిషేధం
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సౌకర్యం
ప్రభుత్వం లేదా సైన్యం ఆరోగ్య పథకంలో చేర్చబడిన వృద్ధులు కూడా ఈ పథకం ప్రయోజనం పొందుతారు. అలాంటి వృద్ధులు తమ పాత స్కీమ్ నుండి వైదొలగడానికి లేదా ఈ కొత్త కవర్ని ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. దీంతో దాదాపు 6 కోట్ల మంది వృద్ధులు ఆరోగ్య సౌకర్యాలు పొందనున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..