Site icon NTV Telugu

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో నమాజ్.. తర్వాత ఏం జరిగిందంటే !

Ayodhya Ram Temple

Ayodhya Ram Temple

Ayodhya Ram Temple: అయోధ్యలోని రామాలయంలో ఒక వ్యక్తి నమాజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం ఒకరు ఆలయ సముదాయం లోపల నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అబ్దుల్ అహ్మద్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డు ప్రకారం.. నిందితుడు జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ నివాసి అని తెలిసింది.

READ ALSO: Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!

ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా మంది ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రస్తుతం ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రార్థన చేయకుండా ఆపిన తర్వాత, ఆయన ఒక నిర్దిష్ట వర్గానికి మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించాడని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న భద్రతా దళాలు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఉన్నత అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు రాయాలయంలోని దక్షిణ కోటలో నమాజ్ చేయడానికి ప్రయత్నించాడని సమాచారం. అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

READ ALSO: Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..

Exit mobile version