Suicide case: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో తండ్రి దినకర్మ జరిగిన రోజే తనయుడు భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా వృత్తిని కొనసాగిస్తున్న భాస్కర్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల భాస్కర్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, ఆ బాధ నుంచి కుటుంబం ఇంకా కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడటంతో ఆటో డ్రైవర్ భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తండ్రి దినకర్మ కార్యక్రమాలు ముగియగానే భాస్కర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కూడా కలిచివేసింది.
