Maharashtra News: మొక్క తిన్నందుకు మేకకు రూ. 2 వేల జరిమానా.. ఒక రోజు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra News: సూర్యుడు తూర్పు నుండి ఉదయించకపోతే పడమర నుండి ఉదయిస్తాడా? చంద్రుని రాత్రి వెదజల్లకపోతే పగలు వెదజల్లుతుందా. గంగోత్రి నుంచి గంగానది ప్రవహించకపోతే బంగాళాఖాతం నుంచి ఉద్భవించేదా? జంతు ప్రపంచంలో చట్టవిరుద్ధం ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైనది వారికి తప్పు. దొంగతనం అంటే ఏమిటో, దొంగతనం తర్వాత సీన్ ఏమిటో జంతువులకు ఎలా తెలుస్తుంది? మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని పిషోర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నాటిన మొక్కను ఓ మేక మేసింది. దొంగతనం చేసిందని అది కూడా పోలీస్ స్టేషన్ లోనేనని దానికి మాత్రం ఏం తెలుసు పాపం.
Read Also:Indigo Airlines: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఐదు రోజుల్లో ఇది రెండోసారి
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
మొక్క తిన్న తర్వాత కూడా అది పారిపోలేదు. బిందాస్ నిశ్చలంగా అక్కడే నిలబడిపోయింది. దీన్నే దొంగతనం అంటారని దానిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేకను రోజంతా స్టేషన్లోనే కట్టేసి ఉంచారు. మూడు వేల విలువైన మేకకు, దాని యజమాని రెండు వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేసి మేకను కూడా కట్టేశారు.ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా కన్నడ తహసీల్ పిషోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేక యజమాని పేరు రౌఫ్ రజాక్ సయ్యద్. మేక యజమానిపై ఐపీసీ సెక్షన్ 90(ఏ) కింద కేసు నమోదు చేశారు. పిషోర్ పోలీస్ స్టేషన్ యొక్క ఈ వింత చర్య సోషల్ మీడియాలో చాలా విమర్శలకు గురవుతోంది.
Read Also:Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
మాజీ మేయర్ బూట్లు దొంగిలించిన కుక్క
నాలుగైదు రోజుల క్రితం ఔరంగాబాద్లో ఇలాంటి దారుణమైన చర్యే తెరపైకి వచ్చింది. ఇక్కడ మాజీ మేయర్ నందకుమార్ ఘోడాలే ఇంట్లో నాలుగు కుక్కలు రూ.15 వేల విలువైన బూట్లు దొంగిలించాయి. దొంగతనం చేశామని వాటికి ఎలా తెలుసు. ఈ కుక్కల ఆచూకీ కోసం మున్సిపాలిటీలోని ఉద్యోగులు, అధికారులు అంతా రెండు రోజులుగా పగలు రాత్రి శ్రమించారు. బూట్లు కనిపించనప్పటికీ నాలుగు కుక్కలలో ఒకటి సీసీటీవీ ఫుటేజీ ద్వారా పట్టుబడింది. మిగిలిన మూడింటి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ను నియమించారు. పట్టుకున్న కుక్కకు ఇప్పుడు శిక్ష విధిస్తున్నారు. దానికి స్టెరిలైజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!