NTV Telugu Site icon

Atrocious On Minor: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్యాయత్నం

Atrocious On Minor

Atrocious On Minor

Atrocious On Minor: రాజస్థాన్‌ లోని జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు కునాల్ (22). ఆగస్టు 25న బాలికను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఒక నెల గడిచాక, సెప్టెంబర్ 27న నిందితుడు న్యూ అతీష్ మార్కెట్ మెట్రో స్టేషన్‌లో తనను కలవడానికి బాధితురాలిని పిలిచాడు. అయితే అక్కడ వారిద్దరి మధ్య మతాల యుద్ధం జరిగింది. ఆ గొడవ తర్వాత అతను అమ్మాయిని ప్లాట్ఫామ్ నుండి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో బాధితురాలికి వెన్నుపూసకు గాయమైంది. బాధితురాలు సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయాన్నీ తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జైపూర్‌ మెట్రో స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో అజయ్‌కాంత్‌ రాటూరి తెలిపారు.

WhatsApp Tag: వాట్సాప్ స్టేటస్‌లో ట్యాగ్ చేయడం ఎలానో తెలుసా? లేదా అయితే ఇలా చేయండి

కేసులో భాగంగా సెప్టెంబరు 27 నాటి మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధిత బాలిక జైపూర్‌లో ఉంటూ నీట్‌కు సిద్ధమవుతోందని, నిందితుడు జోధ్‌పూర్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు పరిచయం. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Israeli Strikes: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి.. పది మంది మృతి.. 40 మందికి గాయాలు