Site icon NTV Telugu

Karnataka: కర్నాటకలో దారుణం.. అందరు చూస్తుండగానే కొడవలితో హత్య

Karnataka

Karnataka

ఎంత టెక్నాలజీ పెరిగినా.. దారుణాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో ఎక్కడో చోట చంపడం, హత్యాచారాలు, దొంగతనాలు.. ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, నిర్ణయాలు తీసుకున్నా.. ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. కర్నాటకలో ఓ వ్యక్తిని కొడవలితో దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల జనాలు అందరూ చూస్తుండగానే కొడవలితో నరికి చంపాడు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.

ఈ ఘటనపై సమాచారం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం హత్యా వివరాలు సేకరించి, మృతుడు నింగప్ప హడపాడ (60)గా గుర్తించారు. మరోవైపు.. హత్యకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Exit mobile version