Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spurious Liquor: తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్కుప్పంకు చెందిన ఆరుగురు ఆదివారం మృతి చెందారు. చెంగల్పట్టు జిల్లాలోని మదురాంతగంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆదివారం ఒక జంట మృతి చెందిందని, అన్నీ అక్రమ మద్యం సేవించడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. “ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు.” అని అధికారులు చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని చెప్పారు.తమిళనాడులోని నార్త్ జోన్లో రెండు వేర్వేరు కల్తీ మద్యం మరణాలు నమోదయ్యాయని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధమున్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే సాధ్యమయ్యే లింక్లను కనుగొనడానికి పోలీసులు కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. “రెండు నకిలీ మద్యం సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి చెంగల్పట్టు జిల్లాలో, మరొకటి విల్లుపురం జిల్లాలో జరిగాయి. విల్లుపురం జిల్లా పరిధిలోని మరక్కనం సమీపంలో గల ఎక్కియార్కుప్పం గ్రామంలో నిన్న 6 మంది వాంతులు, కంటి సమస్యలు, వాంతులు, తల తిరగడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం మేరకు, పోలీసుల బృందం గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆసుపత్రికి చేర్చింది. ఇందులో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండగా చికిత్సకు స్పందించకపోవడంతో నలుగురు మరణించారు. 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ”అని విలేకరుల సమావేశంలో ఐజీ తెలిపారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో విల్లుపురం జిల్లాలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
Also Read
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
Read Also: Terror Funding Case: ఉగ్రవాదులకు నిధుల కేసు.. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
“ఈ సంఘటనకు సంబంధించి, అమరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మిథనాల్ ఉనికిని నిర్ధారించడానికి దానిని ల్యాబ్కు పంపారు” అని ఐజీ తెలిపారు. సంబంధిత అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విల్లుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని, అలాగే చెంగల్పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఐజీ తెలిపారు.
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!