Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత
Spurious Liquor: తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్కుప్పంకు చెందిన ఆరుగురు ఆదివారం మృతి చెందారు. చెంగల్పట్టు జిల్లాలోని మదురాంతగంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆదివారం ఒక జంట మృతి చెందిందని, అన్నీ అక్రమ మద్యం సేవించడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. “ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు.” అని అధికారులు చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని చెప్పారు.తమిళనాడులోని నార్త్ జోన్లో రెండు వేర్వేరు కల్తీ మద్యం మరణాలు నమోదయ్యాయని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధమున్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే సాధ్యమయ్యే లింక్లను కనుగొనడానికి పోలీసులు కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. “రెండు నకిలీ మద్యం సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి చెంగల్పట్టు జిల్లాలో, మరొకటి విల్లుపురం జిల్లాలో జరిగాయి. విల్లుపురం జిల్లా పరిధిలోని మరక్కనం సమీపంలో గల ఎక్కియార్కుప్పం గ్రామంలో నిన్న 6 మంది వాంతులు, కంటి సమస్యలు, వాంతులు, తల తిరగడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం మేరకు, పోలీసుల బృందం గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆసుపత్రికి చేర్చింది. ఇందులో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండగా చికిత్సకు స్పందించకపోవడంతో నలుగురు మరణించారు. 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ”అని విలేకరుల సమావేశంలో ఐజీ తెలిపారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో విల్లుపురం జిల్లాలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also: Terror Funding Case: ఉగ్రవాదులకు నిధుల కేసు.. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
“ఈ సంఘటనకు సంబంధించి, అమరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మిథనాల్ ఉనికిని నిర్ధారించడానికి దానిని ల్యాబ్కు పంపారు” అని ఐజీ తెలిపారు. సంబంధిత అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విల్లుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని, అలాగే చెంగల్పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఐజీ తెలిపారు.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో