Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spurious Liquor: తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్కుప్పంకు చెందిన ఆరుగురు ఆదివారం మృతి చెందారు. చెంగల్పట్టు జిల్లాలోని మదురాంతగంలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆదివారం ఒక జంట మృతి చెందిందని, అన్నీ అక్రమ మద్యం సేవించడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. “ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు.” అని అధికారులు చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు. మొత్తం 10 మంది బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని చెప్పారు.తమిళనాడులోని నార్త్ జోన్లో రెండు వేర్వేరు కల్తీ మద్యం మరణాలు నమోదయ్యాయని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధమున్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అయితే సాధ్యమయ్యే లింక్లను కనుగొనడానికి పోలీసులు కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు. “రెండు నకిలీ మద్యం సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి చెంగల్పట్టు జిల్లాలో, మరొకటి విల్లుపురం జిల్లాలో జరిగాయి. విల్లుపురం జిల్లా పరిధిలోని మరక్కనం సమీపంలో గల ఎక్కియార్కుప్పం గ్రామంలో నిన్న 6 మంది వాంతులు, కంటి సమస్యలు, వాంతులు, తల తిరగడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం మేరకు, పోలీసుల బృందం గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆసుపత్రికి చేర్చింది. ఇందులో ఇద్దరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండగా చికిత్సకు స్పందించకపోవడంతో నలుగురు మరణించారు. 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ”అని విలేకరుల సమావేశంలో ఐజీ తెలిపారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో విల్లుపురం జిల్లాలో మృతుల సంఖ్య ఆరుకు చేరగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also: Terror Funding Case: ఉగ్రవాదులకు నిధుల కేసు.. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
“ఈ సంఘటనకు సంబంధించి, అమరన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మిథనాల్ ఉనికిని నిర్ధారించడానికి దానిని ల్యాబ్కు పంపారు” అని ఐజీ తెలిపారు. సంబంధిత అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విల్లుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని, అలాగే చెంగల్పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశామని ఐజీ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!