Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Assam Himanta Biswa Sarma Vs Gaurav Gogoi Pakistan Link Allegations Row

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Published Date :February 11, 2026 , 1:26 pm
By RAMAKRISHNA KENCHE
Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్‌తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్‌లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.

READ MORE: Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ

ముఖ్యమంత్రి హిమంత్ తన పిల్లల గురించి కూడా ప్రస్తావించారని, అది చాలా దిగజారిన చర్య అని గోగోయ్ విమర్శించారు. మాకు సీఎం కుటుంబం గురించి తెలుసు. కానీ మేము అలాంటి విషయాలు బయట పెట్టమన్నారు. తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను విడుదల చేయాలని గోగోయ్ డిమాండ్ చేశారు. “ఆరు నెలలుగా ఆ నివేదిక ముఖ్యమంత్రి వద్దే ఉంది. నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే అప్పుడే బయట పెట్టేవారు. మొదటి నుంచే నేను దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను. ఇది జాతీయ భద్రత సమస్య అయితే ఆరు నెలలు ఎందుకు మౌనం వహించారు? మా పార్టీ సీఎం కుటుంబం వద్ద 12 వేల బిఘాల భూమి ఉందని బయటపెట్టిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది” అని ప్రశ్నించారు.

READ MORE: The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్‌ లోపాలు..హీరోయిన్‌ కి కూడా డూప్ వాడారా?

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల గోగోయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోగోయ్ భార్య ఎలిజబెత్ కొల్బర్న్‌కు పాకిస్థాన్‌కు చెందిన అలీ తౌఖీర్ షేక్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పాకిస్థాన్‌కు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో గోగోయ్ పాకిస్థాన్ పర్యటన రహస్యంగా జరిగిందని.. అక్కడ ఏదో శిక్షణ తీసుకున్నారనే అనుమానం ఉందని చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలిజబెత్ కొల్బర్న్ పాకిస్థాన్‌లోని LEAD అనే సంస్థలో పనిచేసిందని, ఆ సంస్థను అలీ తౌఖీర్ షేక్ నడిపిస్తారని సీఎం తెలిపారు. భారత్‌కు వచ్చాక కూడా ఆమెకు అక్కడి నుంచే జీతం వచ్చిందని, విదేశీ నిధుల నియమాలను దాటవేశారని ఆరోపించారు. ఆమె భారత్‌లో పనిచేస్తూ సేకరించిన సమాచారాన్ని షేక్‌కు అందించిందని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పాకిస్థాన్ బ్యాంక్ ఖాతాను గోగోయ్ ప్రకటించలేదని విమర్శలు చేశారు. ఈ పరస్పరం ఆరోపణలతో అస్సాం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ali Tauqeer Sheikh
  • Assam CM vs Congress
  • Assam Congress President
  • Assam Latest Political News
  • Assam Political Row

తాజావార్తలు

  • Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

  • Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions