Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.
READ MORE: Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
Also Read
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
ముఖ్యమంత్రి హిమంత్ తన పిల్లల గురించి కూడా ప్రస్తావించారని, అది చాలా దిగజారిన చర్య అని గోగోయ్ విమర్శించారు. మాకు సీఎం కుటుంబం గురించి తెలుసు. కానీ మేము అలాంటి విషయాలు బయట పెట్టమన్నారు. తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను విడుదల చేయాలని గోగోయ్ డిమాండ్ చేశారు. “ఆరు నెలలుగా ఆ నివేదిక ముఖ్యమంత్రి వద్దే ఉంది. నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే అప్పుడే బయట పెట్టేవారు. మొదటి నుంచే నేను దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను. ఇది జాతీయ భద్రత సమస్య అయితే ఆరు నెలలు ఎందుకు మౌనం వహించారు? మా పార్టీ సీఎం కుటుంబం వద్ద 12 వేల బిఘాల భూమి ఉందని బయటపెట్టిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది” అని ప్రశ్నించారు.
READ MORE: The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్ లోపాలు..హీరోయిన్ కి కూడా డూప్ వాడారా?
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల గోగోయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోగోయ్ భార్య ఎలిజబెత్ కొల్బర్న్కు పాకిస్థాన్కు చెందిన అలీ తౌఖీర్ షేక్తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పాకిస్థాన్కు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో గోగోయ్ పాకిస్థాన్ పర్యటన రహస్యంగా జరిగిందని.. అక్కడ ఏదో శిక్షణ తీసుకున్నారనే అనుమానం ఉందని చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలిజబెత్ కొల్బర్న్ పాకిస్థాన్లోని LEAD అనే సంస్థలో పనిచేసిందని, ఆ సంస్థను అలీ తౌఖీర్ షేక్ నడిపిస్తారని సీఎం తెలిపారు. భారత్కు వచ్చాక కూడా ఆమెకు అక్కడి నుంచే జీతం వచ్చిందని, విదేశీ నిధుల నియమాలను దాటవేశారని ఆరోపించారు. ఆమె భారత్లో పనిచేస్తూ సేకరించిన సమాచారాన్ని షేక్కు అందించిందని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పాకిస్థాన్ బ్యాంక్ ఖాతాను గోగోయ్ ప్రకటించలేదని విమర్శలు చేశారు. ఈ పరస్పరం ఆరోపణలతో అస్సాం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
తాజావార్తలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!