Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!
Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.
READ MORE: Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
Also Read
ముఖ్యమంత్రి హిమంత్ తన పిల్లల గురించి కూడా ప్రస్తావించారని, అది చాలా దిగజారిన చర్య అని గోగోయ్ విమర్శించారు. మాకు సీఎం కుటుంబం గురించి తెలుసు. కానీ మేము అలాంటి విషయాలు బయట పెట్టమన్నారు. తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను విడుదల చేయాలని గోగోయ్ డిమాండ్ చేశారు. “ఆరు నెలలుగా ఆ నివేదిక ముఖ్యమంత్రి వద్దే ఉంది. నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే అప్పుడే బయట పెట్టేవారు. మొదటి నుంచే నేను దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను. ఇది జాతీయ భద్రత సమస్య అయితే ఆరు నెలలు ఎందుకు మౌనం వహించారు? మా పార్టీ సీఎం కుటుంబం వద్ద 12 వేల బిఘాల భూమి ఉందని బయటపెట్టిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది” అని ప్రశ్నించారు.
READ MORE: The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్ లోపాలు..హీరోయిన్ కి కూడా డూప్ వాడారా?
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల గోగోయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోగోయ్ భార్య ఎలిజబెత్ కొల్బర్న్కు పాకిస్థాన్కు చెందిన అలీ తౌఖీర్ షేక్తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పాకిస్థాన్కు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో గోగోయ్ పాకిస్థాన్ పర్యటన రహస్యంగా జరిగిందని.. అక్కడ ఏదో శిక్షణ తీసుకున్నారనే అనుమానం ఉందని చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలిజబెత్ కొల్బర్న్ పాకిస్థాన్లోని LEAD అనే సంస్థలో పనిచేసిందని, ఆ సంస్థను అలీ తౌఖీర్ షేక్ నడిపిస్తారని సీఎం తెలిపారు. భారత్కు వచ్చాక కూడా ఆమెకు అక్కడి నుంచే జీతం వచ్చిందని, విదేశీ నిధుల నియమాలను దాటవేశారని ఆరోపించారు. ఆమె భారత్లో పనిచేస్తూ సేకరించిన సమాచారాన్ని షేక్కు అందించిందని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పాకిస్థాన్ బ్యాంక్ ఖాతాను గోగోయ్ ప్రకటించలేదని విమర్శలు చేశారు. ఈ పరస్పరం ఆరోపణలతో అస్సాం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
తాజావార్తలు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!