Kejriwal: రాహుల్ను పీఎంగా అంగీకరిస్తారా? కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఇక శనివారం (మే 25) ఆరో దశ పోలింగ్ జరగనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా కమలం పార్టీని విమర్శించారు.
Also Read
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి రేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉంటారా? అలా కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆప్ ఒక చిన్న పార్టీ అని, కేవలం 22 సీట్లలో పోటీ చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై సమాధానమిస్తూ.. అలాంటి చర్చలేవీ ఇంతవరకూ జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాధానమిచ్చారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైల్లో పెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!