Argentina Protests: అర్జెంటీనాలో ప్రజాగ్రహం.. దేశాన్ని కమ్మేసిన నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Argentina Protests: అర్జెంటీనాలో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. దేశాన్ని మొత్తం నిరసనలు కమ్మేశాయి. ఇంతకీ ఈ దేశంలో ఏం జరుగుతుంది. ప్రజలందరూ రోడ్లపైకి రావడానికి కారణం ఏంటో తెలుసా.. ముగ్గురి బాలిక చావు. అవును ఈ ముగ్గురి బాలిక హత్య దేశవ్యాప్తంగా దుఃఖాన్ని, ఆగ్రహానికి కారణం అయ్యింది. ఈ హత్యలు చాలా దారుణంగా ఉండటంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలికల హత్యలు, వాళ్లను చిత్రహింసలకు గురి చేసిన వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రత్యక్ష వీడియోలను దాదాపు 45 వేల మంది వీక్షించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన తర్వాత దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్తో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ప్రజలు అర్జెంటీనా పార్లమెంట్కు కవాతు నిర్వహించారు.
READ ALSO: Group -2 : గ్రూప్-2 ఫలితాలు విడుదల
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
కనిపించకుండా పోయిన ఐదు రోజుల తర్వాత..
మరణించిన బాలికలు లారా గుటిరెజ్ (15), బ్రెండా డెల్ కాస్టుల్లో, మోరెనా వెర్డి (20 ఏళ్ల)లుకా గుర్తించారు. వీళ్లు ముగ్గురు సెప్టెంబర్ 19న ఒక పార్టీకి హాజరైన తర్వాత కనిపించకుండా పోయారు. ఐదు రోజుల తర్వాత పోలీసులు వారి మృతదేహాలను ఒక ఇంటి వెనుక పాతిపెట్టి ఉన్నట్లు కనుగొన్నారు. పోలీసుల దర్యాప్తులో వాళ్లను మొదట దారుణంగా కొట్టి, వారి గోళ్లను బయటకు తీసి, వేళ్లను నరికి, ఆపై చంపేశారని తేలింది. వీళ్లు తమ నుంచి డ్రగ్స్ దొంగిలిస్తున్నారని అనుమానించిన డ్రగ్స్ ముఠా ఇలా చేసిందని అధికారులు చెబుతున్నారు. ఒక వీడియోలో డ్రగ్స్ ముఠా నాయకుడు “నా నుంచి డ్రగ్స్ దొంగిలించే వారికి కూడా అదే గతిపడుతుంది” అని చెప్పినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో ఒకరి తండ్రి బ్రెండా మాట్లాడుతూ.. తన కుమార్తె పరిస్థితి చూసిన తర్వాత ఆమెను గుర్తుపట్టలేకపోయానని కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రైవేట్ ఖాతా నుంచి ప్రత్యక్ష ప్రసారం..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం ఈ హత్యలను నిందితులు ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ యాజమాన్యంలోని మెటా సంస్థ.. ఈ సంఘటనకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు వాళ్లు కూడా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురి హత్య తర్వాత వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. “తమ జీవితాలకు విలువ లేదా?” అంటూ బ్యానర్లను పట్టుకొని నిరసనలు తెలిపారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో బీకర కాల్పులు.. ముగ్గురు నక్సలైట్లు మృతి
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!