Jesus: క్రిస్మస్ వేళ.. క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు..
- యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
- క్లీన్-షేవ్ చేసుకున్న యేసు
- టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు వరల్డ్ వైడ్ గా అంతా రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానున్న వేళ సందడి వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఇది 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఉంది. ఈ చిత్రంలో యేసును “గుడ్ షెపర్డ్” (మంచి కాపరి)గా చూపించారు. ఆయన యువకుడిగా, గడ్డం లేకుండా, రోమన్ టోగా ధరించి, భుజంపై గొర్రెపిల్లను మోస్తూ ఉన్నారు.
Also Read
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
ఆగస్టు నెలలో హిసార్డెరే నెక్రోపాలిస్లోని భూగర్భ సమాధిలో గుర్తించారు. ఇజ్నిక్ మ్యూజియం ఆర్కియాలజిస్ట్ ఎరెన్ ఎర్టెన్ ఎర్టెమ్ మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కోలు లేట్ పాగనిజం నుంచి ప్రారంభ క్రైస్తవ మతానికి మార్పు చెందుతున్న సమయాన్ని చూపిస్తాయని తెలిపారు. సమాధి గోడలు, పైకప్పు పక్షులు, మొక్కలు, గొర్రెలు వంటి మోటిఫ్లతో అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ నోబుల్ పురుషులు, మహిళలు, దాసుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణకు మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది 3వ శతాబ్దంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురవుతున్న సమయంలో జరిగింది. ఆ కాలంలో క్రూస్ (సిలువ) సంకేతం బదులు “గుడ్ షెపర్డ్” మోటిఫ్ రక్షణ, మోక్షం, దైవిక మార్గదర్శనాన్ని సూచించేదని తెలిపారు.
Also Read:Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్కతా.. మతీశాకు మతిపోయే ధర!
లీడ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుల్సెన్ కుట్బే మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కో అనటోలియాలో ఇలాంటి రకమైన ఏకైక ఉదాహరణ కావచ్చని చెప్పారు. ఈ ఆవిష్కరణ ఇజ్నిక్ చరిత్రకు మరింత విలువను జోడిస్తుంది. ఇక్కడ A.D. 325లో నైసియా కౌన్సిల్ జరిగి, నైసియన్ క్రీడ్ రూపొందింది. గత నెలలో పోప్ లియో XIV ఇజ్నిక్ను సందర్శించారు. ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఈ ఫ్రెస్కో టైల్ పెయింటింగ్ను పోప్కు అందజేశారు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ప్రారంభ క్రైస్తవ కళలో రోమన్ ప్రభావాన్ని, యేసు చిత్రణలో వైవిధ్యాన్ని బయటపెడుతుంది. ఈ ఫ్రెస్కో పరిరక్షణ, అధ్యయనం కొనసాగుతుంది. ఇది ప్రారంభ క్రైస్తవ చరిత్రకు కీలకమైన ఆధారం అవుతుందన్నారు.
తాజావార్తలు
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!