Jesus: క్రిస్మస్ వేళ.. క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు..
- యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
- క్లీన్-షేవ్ చేసుకున్న యేసు
- టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు వరల్డ్ వైడ్ గా అంతా రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానున్న వేళ సందడి వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్ను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఇది 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఉంది. ఈ చిత్రంలో యేసును “గుడ్ షెపర్డ్” (మంచి కాపరి)గా చూపించారు. ఆయన యువకుడిగా, గడ్డం లేకుండా, రోమన్ టోగా ధరించి, భుజంపై గొర్రెపిల్లను మోస్తూ ఉన్నారు.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
ఆగస్టు నెలలో హిసార్డెరే నెక్రోపాలిస్లోని భూగర్భ సమాధిలో గుర్తించారు. ఇజ్నిక్ మ్యూజియం ఆర్కియాలజిస్ట్ ఎరెన్ ఎర్టెన్ ఎర్టెమ్ మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కోలు లేట్ పాగనిజం నుంచి ప్రారంభ క్రైస్తవ మతానికి మార్పు చెందుతున్న సమయాన్ని చూపిస్తాయని తెలిపారు. సమాధి గోడలు, పైకప్పు పక్షులు, మొక్కలు, గొర్రెలు వంటి మోటిఫ్లతో అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ నోబుల్ పురుషులు, మహిళలు, దాసుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణకు మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది 3వ శతాబ్దంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురవుతున్న సమయంలో జరిగింది. ఆ కాలంలో క్రూస్ (సిలువ) సంకేతం బదులు “గుడ్ షెపర్డ్” మోటిఫ్ రక్షణ, మోక్షం, దైవిక మార్గదర్శనాన్ని సూచించేదని తెలిపారు.
Also Read:Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్కతా.. మతీశాకు మతిపోయే ధర!
లీడ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుల్సెన్ కుట్బే మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కో అనటోలియాలో ఇలాంటి రకమైన ఏకైక ఉదాహరణ కావచ్చని చెప్పారు. ఈ ఆవిష్కరణ ఇజ్నిక్ చరిత్రకు మరింత విలువను జోడిస్తుంది. ఇక్కడ A.D. 325లో నైసియా కౌన్సిల్ జరిగి, నైసియన్ క్రీడ్ రూపొందింది. గత నెలలో పోప్ లియో XIV ఇజ్నిక్ను సందర్శించారు. ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఈ ఫ్రెస్కో టైల్ పెయింటింగ్ను పోప్కు అందజేశారు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ప్రారంభ క్రైస్తవ కళలో రోమన్ ప్రభావాన్ని, యేసు చిత్రణలో వైవిధ్యాన్ని బయటపెడుతుంది. ఈ ఫ్రెస్కో పరిరక్షణ, అధ్యయనం కొనసాగుతుంది. ఇది ప్రారంభ క్రైస్తవ చరిత్రకు కీలకమైన ఆధారం అవుతుందన్నారు.
తాజావార్తలు
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!