APPA President Venkat Rami Reddy: ఉద్యోగులకు మేలు చేశా.. అందుకే మళ్ళీ గెలిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండోసారి ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్-అప్సా అధ్యక్షునిగా ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అప్సా కార్యాలయంలో కేక్ కట్ చేసిన వెంకట్రామి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అందచేశారు ఉద్యోగులు. ఈ సందర్భంగా అప్పా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఎన్నికల్లో నాపై నమ్మకంతో గెలిపించారు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఉద్యోగులకు నా వంతు మేలు చేశాను. ఇప్పుడు అందుకే నన్ను మళ్ళీ గెలిపించారు. నా విజయంతో ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలమని ఒప్పుకుంటారా..?
నన్ను ఓడించడానికి చాలా మంది ప్రయత్నించారు. నన్ను ఎంత టార్గెట్ చేసినా.. ఉద్యోగులు మాత్రం మమ్మల్ని గెలిపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో వరసగా రెండో సారి అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంకట్రామిరెడ్డిని అభినందించారు.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?

సీఎం జగన్ ని కలిసిన వెంకట్రామిరెడ్డి
తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కాకర్ల వెంకట్రామిరెడ్డి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఉద్యోగులు నా వైపే ఉన్నారు. ఎన్నికలనగానే చాలా అసత్యాలు ప్రచారం చేశారు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు చూసి ఎన్నికలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలనే నేను ఎన్నికలకు వెళ్లాను. నిజాయితీగా పని చేసే వారికే ఉద్యోగులు పట్టం కట్టారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానన్నారు కాకర్ల వెంకట్రామిరెడ్డి.
Read Also:Today (22-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ.. ‘కొవిడ్’ భయాలు.. నష్టాలు..
ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్ ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి వర్గం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్సా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి 296 ఓట్ల మెజార్టీ లభించింది. వైస్ ఛైర్మన్ గా ఎర్రన్న యాదవ్, వైస్ ఛైర్మన్ (మహిళ) – సత్య సులోచన, సెక్రటరీగా శ్రీ కృష్ణ, అడిషనల్ సెక్రటరీగా గోపీకృష్ణ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా రమాదేవి, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గా మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి, ట్రెజరర్ గా వెంకట్ ఎన్నికయ్యారు. దీంతో సెక్రటేరీయేట్లో వెంకట్రామి రెడ్డి వర్గం సంబరాలు చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు గెలుచుకుంది వెంకట్రామి రెడ్డి వర్గం. మొత్తం 9 పోస్టులకు 30 మంది అభ్యర్థులు పోటీచేశారు.
Read Also: Sreeleela: యంగ్ హీరోయిన్ కి కూడా కటౌట్ పెట్టేసారు…
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!