Hotel Cheating: హోటల్ బిల్లు రూ.6 లక్షలు.. బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు మాత్రమే! ఏపీ మహిళ మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Woman racked up Rs 6 lakh bill at Delhi hotel: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో బస చేసి.. బిల్లు కట్టే సమయంలో మోసం చేసింది. హోటల్లో బిల్లు దాదాపు రూ. 6 లక్షలు కాగా.. యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చీటింగ్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ డిసెంబర్ 13న ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో 15 రోజులకు ఓ రూమ్ బుక్ చేసుకుంది. 15 రోజులకు మొత్తం బిల్లు రూ.5,88,176లు అయింది. హోటల్లో ‘స్పా’ కోసం ఆమె ఏకంగా రూ.2.11 లక్షలను ఖర్చు చేసింది. హోటల్ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో.. హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 13న ఆమెను అరెస్టు చేశారు.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
Also Read: Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంతరాయం!
ఝాన్సీ రాణి ఉపయోగించిన ఖాతా నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ఇషా దేవ్ అనే నకిలీ ఐడెంటిటీ కార్డును ఆమె చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.41 మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చీటింగ్ కేసులో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో ఝాన్సీ రాణి తాను వైద్యురాలినని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్లో ఉంటామని పోలీసులకు తెలిపింది. ఆమె పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఢిల్లీ పోలీసులు ఆశ్రయించిచారు. లగ్జరీ హోటల్లో మోసానికి పాల్పడడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం ఒక వ్యక్తి ఓ 5 స్టార్ హోటల్లో రూ. 23 లక్షలను మోసగించాడు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!