Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
- పెండింగ్ రిజిస్ట్రేషన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసే కొత్త విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన 24 గంటల్లోనే అధికారుల ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు కూడా ఒకే రోజులో పూర్తవుతాయని పేర్కొన్నారు. అయితే ఫ్యాన్సీ నంబర్ తీసుకునే వాహనాలకు మాత్రమే ఈ గడువు వర్తించదని చెప్పారు. కొత్త విధానంలో మరో కీలక అంశం ఆటోమేటిక్ ఆమోదం. నిర్ణయించిన గడువులోపు అధికారులు స్పందించకపోతే.. వ్యవస్థ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ను ఆమోదించేలా టెక్నాలజీ ఆధారిత విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తగ్గడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
Also Read
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ వాహన రిజిస్ట్రేషన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు సులభమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!