Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
- ఉక్కపోత నుంచి ఉపశమనం..
- మూడు రోజుల పాటు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీని ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఈ ఉపశమనం తాత్కాలికమేనని, వచ్చే వారం నుంచి ఎండల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికం కావచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read:Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. రాయలసీమలో మాత్రం వచ్చే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మూడు రోజుల తర్వాత ఎండల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి.
రైతులకు, ప్రజలకు సూచనలు
అకాల వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల తీవ్రత పెరిగే సమయంలో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కరం.
తాజావార్తలు
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!