AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
- ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
- ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
- మన మిత్ర వాట్సప్ యాప్లో కూడా ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని, జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని, పాస్ అవ్వడానికి ఇది మరో అవకాశం అని మంత్రి చెప్పుకొచ్చారు.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. అలానే మన మిత్ర వాట్సప్ యాప్, లీప్ మొబైల్ యాప్లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి.. విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం రోల్ నంబరు ఎంటర్ చేస్తే.. ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి. అదేవిధంగా ‘ఎన్టీవీ‘లో కూడా సులువుగా పదో తరగతి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
📢 The SSC Public Examinations results for March 2025 have been announced. 📢
This year, out of 6,14,459 students who appeared, 4,98,585 have passed, achieving a pass percentage of 81.14%👏👍🏻. I’m delighted to see that Parvathipuram Manyam district has topped the list with an…
— Lokesh Nara (@naralokesh) April 23, 2025
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!